Kotamreddy: ఇకపై హెచ్చరికలు లేకుండా గెరిల్లా తరహా ఉద్యమాలు: కోటంరెడ్డి
ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేస్తూనే ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు.
నెల్లూరు: ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేస్తూనే ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ప్రజా ఉద్యమాలను ఆపలేరని చెప్పారు. గాంధీనగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం నిరసన తెలపనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ఇక నుంచి ముందస్తు హెచ్చరికలు లేకుండా గెరిల్లా తరహాలో ఉద్యమాలు చేస్తామన్నారు.
‘‘క్రిస్టియన్ల కోసం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. రూ.7కోట్ల నిధులు కావాలంటే అందుకు సీఎం జగన్ అంగీకరించారు. నిధులు ఇవ్వాలని కోరుతూ ఇచ్చిన మూడు వినతిపత్రాలపై సీఎం సంతకాలు చేశారు. నాలుగేళ్లవుతున్నా నిధులు మాత్రం రాలేదు. సీఎం కార్యాలయానికి క్రిస్టియన్ల నుంచి విజ్ఞప్తులు పంపించాం. అయినా స్పందించకపోవడంతోనే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాం. దీనికోసం చేసిన ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే అడ్డుకోవడం ఎంతవరకు సబబు? నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉన్నా. ప్రభుత్వం అడ్డుకున్నా.. ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే ఉంటా. శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం ఎంత అణచివేసినా మేం వెనుకడుగు వేయం’’ అని కోటంరెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?