Raja singh: నేను బతికితే ఏంటి? చస్తే ఏంటి? అని భావిస్తున్నారు: రాజాసింగ్
బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరగకపోతే నోటీసులు ఇస్తున్నారు.. తిరిగితే ఆ వాహనం ఎక్కడ ఆగిపోతుందో అర్థం కావట్లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బతికితే ఏంటి? చస్తే ఎంటి? అనే భావనలో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని విమర్శించారు. మొరాయిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని అధికారులకు గతంలోనే లేఖ రాశానని, అయినా అదే వాహనాన్ని బాగు చేసి తిరిగి పంపించారని ఆరోపించారు. ప్రాణహాని ఉంది కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చామని అధికారులు చెబుతున్నారన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరగకపోతే నోటీసులు ఇస్తున్నారని, తిరిగితే ఆ వాహనం ఎక్కడ ఆగిపోతుందో అర్థం కావట్లేదని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అగ్గి చల్లారిందా..? రాహుల్-ఉద్ధవ్ మధ్య ‘సావర్కర్ వివాదం’ సద్దుమణిగిందా..?
-
General News
Viveka Murder Case: ముందస్తు బెయిల్ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన అవినాష్రెడ్డి
-
Movies News
Social Look: పల్లెటూరి అమ్మాయిగా దివి పోజు.. శ్రీముఖి ‘పింక్’ పిక్స్!
-
World News
Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!
-
Sports News
Cricket: నాన్స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్
-
General News
Amaravati: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు