MLA Rajasingh: పాతబస్తీ అభివృద్ధి కోసం పోరాటం చేసేది భాజపానే: రాజాసింగ్
పాతబస్తీకి మెట్రో రైలు లైన్ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. గతంలో పాతబస్తీకి మెట్రో రూట్ సిద్ధమైందని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పారని.. వెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీకి మెట్రో రైలు లైన్ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. మెట్రో లైన్ కోసం భాజపా దీక్ష చేస్తే పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డారు. భాజపా డిమాండ్లో ఏమైనా తప్పు ఉందా అని కేసీఆర్, కేటీఆర్ను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ‘‘గతంలో అసెంబ్లీ సాక్షిగా పాతబస్తీ ఎందుకు అభివృద్ది జరగడం లేదు.. మెట్రోను ఎందుకు తీసుకువెళ్లడంలేదని నిలదీశాం. అప్పుడు పాతబస్తీకి మెట్రోకి రూట్మ్యాప్ సిద్ధమైందని.. నిధులు మంజూరయ్యాయని చెప్పారు. వెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుంది తప్పితే ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సైతం అసెంబ్లీలో మెట్రో కావాలని అడిగి.. సీఎం ఛాంబర్కు వెళ్లి పాతబస్తీకి మెట్రో వద్దని అంటారు. పాతబస్తీ అభివృద్ధి చెందితే రాజకీయ భవిష్యత్ ఉండదనే భావనతోనే అక్కడ ఎలాంటి పనులు చేపట్టట్లేదు. పాతబస్తీ ప్రజలకు చెప్పేది ఒక్కటే మీకోసం పోరాటం చేసేది భాజపా మాత్రమే. పాతబస్తీ అభివృద్ధి చెందాలంటే భాజపాకి మద్దతు ఇవ్వాలి’’ అని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM