ప్రోటోకాల్‌ పాటించడం లేదు: ఎమ్మెల్యే రోజా

తిరుపతిలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని నగరి ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో జరిగిన శాసనసభా హక్కుల

Updated : 19 Jan 2021 04:11 IST

సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు

తిరుపతి: తిరుపతిలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని నగరి ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో జరిగిన శాసనసభా హక్కుల కమిటీ సమావేశంలో ఆమె గోడు వెల్లబోసుకున్నారు. రోజా లేవనెత్తిన కొన్ని అంశాలు కమిటీ పరిధిలోకి రావని.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శాసనసభా హక్కుల కమిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నిబంధనలను పాటించడంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయని రోజా చెప్పారని.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాంటి సమస్యలను సరిచేసి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారని కాకాణి తెలిపారు.

ఇదీ చదవండి..

పంచాయతీ పోరుపై విచారణ రేపటికి వాయిదా

కేటీఆర్‌ను కలిసిన క్రికెటర్‌ హనుమ విహారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు