నిమ్మగడ్డ కావాలనే వ్యతిరేకిస్తున్నారు: రోజా

దేశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్‌ఈసీ విభేదించిన సందర్భాలు లేవని.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కావాలనే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎస్‌ఈసీ..

Published : 25 Jan 2021 01:02 IST

తిరుమల: దేశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్‌ఈసీ విభేదించిన సందర్భాలు లేవని.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కావాలనే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎస్‌ఈసీ వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని కోరామే తప్ప.. ఎన్నికలకు భయపడికాదన్నారు. ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలను వాయిదా వేస్తుందనే విశ్వాసంతో ఉన్నట్లు రోజా తెలిపారు.

ఇవీ చదవండి..

వెంగయ్య మృతితో సంబంధం లేదు: అన్నా రాంబాబు

గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: యనమల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని