Kavitha: నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేసినట్టు వచ్చిన....

Updated : 16 Sep 2022 16:58 IST

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు తనకు నోటీసులు జారీ చేసినట్టు వచ్చిన వార్తలపై తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని స్పష్టంచేశారు. దిల్లీలో కూర్చొని కొందరు దురుద్దేశపూర్వకంగా మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. మీడియా సంస్థలు తమ సమయాన్ని నిజాల్ని చూపించేందుకు ఉపయోగించాలని ట్విటర్‌లో కోరారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు.. తనకెలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేయదలచుకున్నానంటూ కవిత పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని