రాష్ట్రాన్ని చీకటి కోణంలో చూపించే యత్నం: విజయన్
కేరళ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, భాజపాలు కుట్రపన్నుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. రాష్ట్ర మనుగడను ప్రశ్నార్థకం చేయాలనుకున్నవారే ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు....
తిరువనంతపురం: కేరళ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, భాజపాలు కుట్రపన్నుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. రాష్ట్ర మనుగడను ప్రశ్నార్థకం చేయాలనుకున్నవారే ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లా కన్నూరులో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న విజయన్ ప్రతిపక్షాలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మత రాజకీయాలు చేసేందుకు ఆరెస్సెస్ చేసే ప్రయత్నాలు ఫలించబోవని, ఇక్కడ లౌకికతత్వ పునాదులు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కేరళను సోమాలియాతో పోల్చారన్న విజయన్.. రాష్ట్రాన్ని చీకటి కోణంలో చూపించేందుకే సంఘ్ పరివార్ ఆసక్తి చూపిస్తోందని ఆరోపించారు. ఏప్రిల్ 6న జరిగే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, భాజపాలకు సరైన సమాధానం ఇస్తారని పినరయి అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు