Mamata Banerjee: మోదీ టైం ఇచ్చారు.. దిల్లీ వెళ్లి కలుస్తా!
కోల్కతా: వచ్చే వారం దిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నట్టు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కోల్కతాలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండు, మూడు రోజులు దిల్లీ పర్యటనకు వెళ్తున్నా. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమయం ఇస్తే ఆయన్ను కలుస్తా. ప్రధాని నరేంద్ర మోదీ నాకు సమయం ఇచ్చారు. ఆయనతో సమావేశమవుతా’ అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అపూర్వ విజయం సాధించిన తర్వాత మమత దిల్లీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆమె ఈ నెల 28న మోదీని కలవనున్నట్టు సమాచారం.
మరోవైపు, మమత దిల్లీ పర్యటన అంశం జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మే నెలలో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఘన విజయం అందించిన దీదీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో హస్తినకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఆమె దిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్పవార్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితర కీలక నేతలతోనూ భేటీ అవుతారని సమాచారం. 2024 లోక్సభ ఎన్నికలకు భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ జాతీయ రాజకీయాల్లో దీదీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న విశ్లేషణలూ వినబడుతున్నాయి.
పెగాసస్.. వాటర్ గేట్ స్కాం కన్నా పెద్దది!
దేశంలో కలకలం రేపుతున్న పెగాసస్ వ్యవహారంపై వరుసగా రెండో రోజూ కేంద్రంపై దీదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1972లో అమెరికాలో జరిగిన వాటర్ గేట్ కుంభకోణం కన్నా పెగాసస్ స్కాం పెద్దదని వ్యాఖ్యానించారు. ఫోన్ల ట్యాపింగ్, మీడియా సంస్థలపై ఐటీ దాడులను చూస్తుంటే దేశం సూపర్ ఎమర్జెన్సీలో ఉన్నట్టుగా అనిపిస్తోందన్నారు. మీడియా సంస్థలు, పాత్రికేయులపై ఐటీ దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. గురువారం ఆమె కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ.. ఓ వైపు ఏకపక్ష దాడులు, మరోవైపు పెగాసస్ వ్యవహారం ప్రమాదకరంగా మారాయన్నారు. నిష్పాక్షిక సంస్థలన్నీ భాజపా హయాంలో రాజకీయమయమైపోయాయని విమర్శించారు. భాజపా నాయకత్వం తన సొంత మంత్రులు, అధికారులనే నమ్మడంలేదని దీదీ ఆరోపించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eknaht Shindhe: శిందే కేబినెట్లో ఫడణవీస్కే కీలక శాఖలు
-
Sports News
Cheteshwar Pujara : చితక్కొట్టిన పుజారా.. వరుసగా రెండో శతకం
-
Crime News
Crime News: బిహార్లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
-
World News
UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో.. ముందంజలో లిజ్ ట్రస్..!
-
Politics News
Pawan Kalyan: పదవి వెతుక్కుంటూ రావాలి గానీ పదవి వెంట పడకూడదు: పవన్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్ఝున్వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- RRR: ఆస్కార్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
- Bangladesh economic crisis: ఆర్థిక సంక్షోభం అంచున బంగ్లాదేశ్..!
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్ఛైర్లో ఝున్ఝున్వాలా డ్యాన్స్