మోదీ.. దేశంలోనే అగ్రనాయకుడు: సంజయ్
ప్రధాని మోదీని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. దేశంలోనే మోదీ అగ్రనాయకుడనీ, భాజపా అగ్రపార్టీ అని ఆయన అన్నారు. ఇందులో వింతేముంది అనుకోవద్దు. సాధారణంగా ప్రతిపక్షనేతలు అధికార పార్టీ నేతలను ప్రశసించరు. అందులోనూ రాజకీయ పరమైన కారణాలతో రెండు చిరకాల మిత్ర పక్షపార్టీలు విడిపోయిన తర్వాత అలా జరగడం...
దిల్లీ: ప్రధాని మోదీని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. దేశంలోనే మోదీ అగ్రనాయకుడనీ, భాజపా అగ్రపార్టీ అని ఆయన అన్నారు. ఇందులో వింతేముంది అనుకోవద్దు. సాధారణంగా ప్రతిపక్షనేతలు అధికార పార్టీ నేతలను ప్రశంసించరు. అందులోనూ రాజకీయ పరమైన కారణాలతో రెండు చిరకాల మిత్ర పక్షపార్టీలు విడిపోయిన తర్వాత అలా జరగడం చాలా అరుదు. అయితే.. తౌక్టే తుపాను పరిహారం నిధులపై చర్చించేందుకు ప్రధాని మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశమైన తర్వాత సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘‘గత ఏడేళ్లలో భాజపా విజయానికి మోదీయే కారణం. దేశంలో ప్రస్తుతం ఆయనే అగ్రనాయకుడు. భాజపాయే అగ్ర పార్టీ. ఈ విషయాన్ని నేను ఏ మీడియా రిపోర్టుల ఆధారంగా చెప్పడం లేదు. దీనిపై అధికారికమైన ప్రకటన ఏదీ లేదు’’ అని సంజయ్ వెల్లడించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇమేజ్తోనే భాజపా అధికారంలోకి వచ్చిందని రౌత్ అన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త వ్యతిరేకత వ్యక్తమైన మాట వాస్తవమేనని చెప్పారు. కేరళలో ఒక్కస్థానాన్ని కూడా దక్కించుకోని భాజపా.. తమిళనాడులో 4, పశ్చిమ్ బెంగాల్లో 77 స్థానాలకు పరిమితమైన విషయం తెలిసిందే.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భాజపా, శివసేన మిత్రపక్షాలుగా ఉండేవి. అయితే రాజకీయ పరమైన విభేధాలతో ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ‘మహా వికాస్ అఘాడీ’గా ఏర్పడి అధికారం అందుకుంది. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, మోదీతో, ఉద్దవ్ ఠాక్రే సమావేశమైన తర్వాత సంజయ్ రౌత్ భాజపాకు అనుకూలంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా