Motkupalli: కారెక్కనున్న మోత్కుపల్లి.. ముహూర్తం ఖరారు

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాస తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. సోమవారం (ఈ నెల 18న) ఆయన కారెక్కనున్నారు. మోత్కుపల్లి తెరాసలో

Updated : 30 Sep 2022 14:37 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాస తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. సోమవారం (ఈ నెల 18న) ఆయన కారెక్కనున్నారు. మోత్కుపల్లి తెరాసలో చేరే ప్రయత్నాలు గత కొన్నాళ్లుగా కొనసాగుతున్నాయి. దళితబంధుపై ముఖ్యమంత్రి నిర్వహించిన సన్నాహక సమావేశాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అప్పట్నుంచే తెరాసలో చేరతారన్న ప్రచారం కొనసాగుతోంది. ఇటీవల శాసనసభలోనూ దళితబంధుపై చర్చ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటే ఉన్నారు. త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని అప్పట్లో అందరూ భావించారు. అందుకు అనుగుణంగా సోమవారం ఆయన తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు.  సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో జరగబోయే కార్యక్రమంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకోనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు