AP News: విచారణ ఎదుర్కోలేక రఘురామ దిల్లీ పారిపోయారు: భరత్‌

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ విచారణ ఎదుర్కోలేక దిల్లీకి పారిపోయారని వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

Updated : 15 Jan 2022 06:10 IST

రాజమహేంద్రవరం: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ విచారణ ఎదుర్కోలేక దిల్లీకి పారిపోయారని వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రఘురామపై అనర్హత వేటు ఖాయమని చెప్పారు. చట్టంపై గౌరవం ఉందని చెబుతున్నప్పుడు .. విచారణ ఎందుకు ఎదుర్కోవడంలేదని ప్రశ్నించారు. ‘‘సీఎం దయాదాక్షిణ్యాలతోనే రఘురామ ఎంపీ అయ్యారు. జగన్‌ మోహన్‌రెడ్డి నీకు ఎంపీ పదవి ఇస్తే ఏం విశ్వాసం ఉంది. సీఎంను విమర్శించే స్థాయా నీది’’ అని భరత్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని