సింధియా విధేయులకు మంత్రి పదవులు!
మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆదివారం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. భాజపా సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆదివారం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. భాజపా సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇటీవల నవంబర్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో తులసీరాం సిలావత్, గోవింద్ రాజ్పూత్లు ఘన విజయం సాధించడంతో వారికి అమాత్య పదవి కట్టబెడుతూ నిర్ణయించారు. రాజ్భవన్లో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సమక్షంలో ఇద్దరు నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేరికతో చౌహాన్ నేతృత్వంలోని మంత్రి మండలి సభ్యుల సంఖ్య 31కి చేరింది. చౌహాన్ మంత్రివర్గంలో ఇప్పటికే సింధియా వర్గీయులు 12 మంది మంత్రి పదవులు పొందారు.
ప్రస్తుతం మంత్రివర్గంలోకి వచ్చిన సిలావత్, రాజ్పూత్లు ఇద్దరూ గతేడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ ఆ పార్టీకి రాజీనామా చేసి సింధియా నాయకత్వంలో భాజపాలో చేరారు. దీంతో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో.. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం నవంబర్లో 28 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా.. భాజపా 19 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ