Raghurama: రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తా: రఘురామ

త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

Updated : 07 Jan 2022 13:57 IST

హైదరాబాద్‌: త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తానే సమయం ఇస్తున్నానని.. వారంలో నిర్ణయం చెప్పాలని పరోక్షంగా వైకాపా అధినాయకత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో రఘురామ మీడియాతో మాట్లాడారు. తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని చెప్పారు. తాను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని.. వైకాపాపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించేందుకు, రాజధానిగా అమరావతే కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రఘురామ చెప్పారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని