Mulayam Singh Yadav: కొడుకు పేరు మర్చిపోయిన ములాయం.. యోగి సెటైర్లు..!
ఈసారి జరుగుతోన్న ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక నేత ములాయంసింగ్ యాదవ్ గురువారం కనిపించారు. తన కుమారుడు
కర్హాల్: ఈసారి జరుగుతోన్న ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక నేత ములాయంసింగ్ యాదవ్ గురువారం కనిపించారు. తన కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తోన్న కర్హాల్ నియోజకవర్గ ఎన్నికల ర్యాలీలో ములాయం పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సభలో మాట్లాడిన ములాయంకు కొడుకు అఖిలేశ్ పేరు గుర్తురాలేదు. పక్కన ఉన్న మరో ఎస్పీ నేత చెప్పడంతో తన కుమారుడిని గెలిపించాలని ములాయం కోరారు.
నిన్న ఎన్నికల ప్రచారంలో ములాయం ప్రసంగం చివరికి వస్తుండగా పక్కనే ఉన్న ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ‘ఓట్లు అడగండి’ అని నేతాజీ దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ క్షణంలో ములాయం కొంత గందరగోళానికి గురైనట్లు కన్పించారు. కర్హాల్ అభ్యర్థి తన కుమారుడే అన్న విషయం గుర్తు రాలేదేమో.. ‘‘ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని గెలిపించండి’’ అని ఓటర్లను కోరారు. దీంతో ధర్మేంద్ర యాదవ్.. ములాయంకు అఖిలేశ్ పేరు చెప్పగా భారీ మెజార్టీతో అఖిలేశ్ను గెలిపించండి అని అభ్యర్థించారు.
ఇక ప్రత్యర్థులు ఊరుకుంటారా.. ములాయం ప్రసంగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. అఖిలేశ్పై వ్యంగ్య బాణాలు విసిరారు. ‘‘నేతాజీ(ములాయంను ఉద్దేశిస్తూ) చాలా తెలివైన వారు. కర్హాల్ ప్రజలు భాజపా అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్ను గెలిపిస్తారని ఆయనకు తెలుసు. కానీ ‘నా పేరు చెప్పండి’’ అంటూ ఆయన(అఖిలేశ్ను ఉద్దేశిస్తూ) పదేపదే గుర్తుచేస్తున్నారు. కర్హాల్ నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ అభ్యర్థి తనకు తెలియదని ములాయం చెప్పారు. తండ్రికే తన కుమారుడి పేరు గుర్తులేకపోవడం దురదృష్టకరం. ఆ పార్టీకి ఎంతటి దుర్గతి పట్టిందో..!’’ అని యోగి ఎద్దేవా చేశారు.
యావత్ దేశాన్ని ఆకర్షిస్తోన్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 20న అక్కడ మూడో విడత ఓటింగ్ జరగనుంది. ఈ దశలో సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తోన్న కర్హాల్ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరగనుంది. అఖిలేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆయనను ఎదుర్కొనేందుకు భాజపా.. కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ను రంగంలోకి దించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!