Bjp: భాజపాలో చేరిన ముస్లిం నాయకురాలు
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ(భాజపా)కి ఈ మధ్య ముస్లింల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. తాజాగా ముస్లిం నాయకురాలు, మహిళల హక్కుల కార్యకర్త నిదా ఖాన్ భాజపాలో అందరినీ
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ(భాజపా)కి ముస్లింల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. తాజాగా ముస్లిం నాయకురాలు, మహిళల హక్కుల కార్యకర్త నిదా ఖాన్ భాజపాలో అందరినీ ఆశ్చర్యపర్చారు. ఆమె కాంగ్రెస్ మద్దతుదారుడు, ఇత్తిహద్ ఇ మిల్లాట్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తాఖీర్ రజా ఖాన్ కోడలు.. ట్రిపుల్ తలాక్ బాధితురాలు.
భాజపా కండువా కప్పుకున్న అనంతరం నిదా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ట్రిపుల్ తలాక్ను నిషేధించి తమకు అండగా నిలిచారని చెప్పారు. ‘‘ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చి భాజపా గొప్ప పని చేసింది. నా జీవితంలో ఈ చట్టం ఓ కీలక మలుపుగా నిలిచింది. అందుకే, భాజపాకు మద్దతిస్తున్నా. ఇతర పార్టీలు మహిళల సాధికారత, వారి భద్రతపై కేవలం నినాదాలే ఇస్తున్నాయి. భాజపా మాత్రమే చేసి నిరూపించింది’’అని నిదా ఖాన్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ముస్లిం మహిళలంతా భాజపాకే ఓటు వేస్తారని, రాష్ట్రంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిదా ఖాన్తోపాటు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం కమలదళంలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై ఛీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి