Maharashtra crisis: అధికారం ఉన్నా.. లేకపోయినా మేం ఠాక్రే వెంటే..: చవాన్
మహారాష్ట్రలోని శివసేనలో తీవ్ర అంతర్గత సంక్షోభం నెలకొన్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ (Prithviraj Chavan) కీలక వ్యాఖ్యలు చేశారు. ......
దిల్లీ: మహారాష్ట్రలోని శివసేనలో తీవ్ర అంతర్గత సంక్షోభం నెలకొన్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ (Prithviraj Chavan) కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఈ కష్ట సమయంలో ఉద్ధవ్ ఠాక్రే వెన్నంటే ఉంటామని స్పష్టంచేశారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఐక్యంగానే నిలబడుతుందని వ్యాఖ్యానించారు. సోమవారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో నెలకొన్న ఈ రాజకీయ సంక్షోభానికి భాజపానే కారణమని చవాన్ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తోందని మండిపడ్డారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై తదుపరి వ్యాఖ్యలు చేసేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తమ వైఖరి మార్చుకొని గువాహటి నుంచి ముంబయికి తిరిగి వస్తారంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విశ్వాసం వ్యక్తంచేసిన మరుసటి రోజే పృథ్వీరాజ్ చవాన్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్