నా భర్తకు ప్రాణహాని ఉంది: రఘురామ భార్య
తన భర్తకు ప్రాణహాని ఉందని నర్సాపురం ఎంపీ రామకృష్ణరాజు భార్య రమ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మంగళగిరి తీసుకెళ్లిపోయారని, శుక్రవారం రాత్రంతా నానా...
అమరావతి: తన భర్తకు ప్రాణహాని ఉందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు భార్య రమ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మంగళగిరి తీసుకెళ్లిపోయారని, శుక్రవారం రాత్రంతా నానా ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని కోర్టు చెప్పినా వినకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారని అన్నారు. తన భర్తకు ఏది జరిగినా దానికి ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సీఐడీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేశారు.
గుంటూరు జైలులో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజును తక్షణం రమేశ్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన ఆయన శరీరంపై గాయాలకు సంబంధించి వైద్య నివేదిక జిల్లా కోర్టు నుంచి ప్రత్యేక మెసెంజర్లో అందిన తర్వాత ఇవాళ సాయంత్రం హైకోర్టు విచారణ చేపట్టింది. మెడికల్ బోర్డుతోపాటు రమేశ్ ఆస్పత్రి వైద్యులు గాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కస్టడీలో ఉండగా సీఐడీ అధికారి పిటిషనర్ను కలిశారని, ఇది చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిమాండ్ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తక్షణమే రఘురామను రమేశ్ ఆస్పత్రికి పంపాలని ఆదేశించింది. మరోవైపు రఘురామకృష్ణరాజును పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య జిల్లా జైలుకు తరలించారు. ఎవరూ ఊహించని విధంగా గుంటూరు జీజీహెచ్ వెనక గేటు నుంచి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?