Gujarat polls: భాజపా ప్రచార వ్యూహం.. ఒకేరోజు 89 ర్యాలీల్లో హేమాహేమీలతో క్యాంపెయిన్!
గుజరాత్(Gujarat polls)లో ఈసారి కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న కమలనాథులు ఈ ఎన్నికల్లో మరింత కసిగా పనిచేస్తున్నారు. గతంలో కన్నా అధికంగా సీట్లు, ఓట్లు సాధించి రికార్డులన్నింటినీ బ్రేక్ చేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు.
దిల్లీ: గుజరాత్(Gujarat polls)లో ఈసారి కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్న కమలనాథులు ఈ ఎన్నికల్లో మరింత కసిగా పనిచేస్తున్నారు. గతంలో కన్నా అధికంగా సీట్లు, ఓట్లు సాధించి రికార్డులన్నింటినీ బ్రేక్ చేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థులను ఎంపిక చేయడం మొదలుకొని ప్రచారం దాకా పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. మోదీ, అమిత్ షాల స్వరాష్ట్రంలో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా ఏడోసారి కూడా తామే అధికారంలోకి రావాలన్న సంకల్పంతో సర్వశక్తుల్నీ ధారపోస్తున్నారు. డిసెంబర్ 1న తొలివిడత పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి దిగ్గజ నేతలు ప్రచారం నిర్వహించారు. అయితే, తాజాగా ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావించిన భాజపా.. హేమాహేమీ నేతలను ప్రచారంలోకి దించాలని నిర్ణయించినట్టు సమాచారం.
తొలి విడతలో ఎన్నికలు జరిగే 89 నియోజకవర్గాల్లో శుక్రవారం ఒక్కరోజే వరుస సభలతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, సీఎంలు గుజరాత్లో సుడిగాలి పర్యటనలతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. జేపీ నడ్డా నవసరి, రాజ్కోట్ తూర్పు, అంక్లేశ్వర్లలో ప్రచారంలో పాల్గొననుండగా... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (మూడు) నరేంద్రసింగ్ తోమర్ (నాలుగు) అనురాగ్ ఠాకూర్ (నాలుగు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (మూడు), మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ నాలుగు చోట్ల బహిరంగ ర్యాలీల్లో పాల్గొననున్నారు. అలాగే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, కేంద్రమంత్రులు వీకే సింగ్, ఫగన్ సింగ్ కులస్థే తదితర నేతలు పలు ర్యాలీల్లో పాల్గొని ప్రచారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
గుజరాత్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1న, రెండో విడత పోలింగ్ డిసెంబర్ 5న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 1995 నుంచి నిరాటంకంగా అధికారంలో కొనసాగుతున్న భాజపా ఈసారి కూడా గుజరాత్ పీఠాన్ని పదిలం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. గత వైభవం కోసం కాంగ్రెస్ కూడా గట్టిగానే పోరాడుతోంది. ఇంకోవైపు, పంజాబ్లో గెలుపుతో ఉత్సాహంలో ఉన్న ఆప్ తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఓటర్లలోకి దూసుకెళ్తుండటంతో ఈసారి గుజరాత్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో గుజరాత్లో ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. -
దుష్ట పాలనను అంతం చేద్దాం
శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. -
ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!
అయిదేళ్లలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. -
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
న్యాయమూర్తులపై దూషణ కేసు నిందితుడితో ఉన్న... జగన్, విజయసాయిరెడ్డిలు నేరస్థులే!
‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
సాక్షిలో పనిచేసిన వారు, జగన్ బంధుమిత్రులే సలహాదారులు
సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులు చేస్తున్న జగన్
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
జగన్పై దాడి కేసులో.. బొండా ఉమాను ఇరికించేందుకు వైకాపా కుట్ర
సీఎం జగన్పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. -
వైకాపాకు అనుకూలంగా విజయవాడ సీపీ దర్యాప్తు
సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్ కమిషనర్(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
‘ముస్లింలలో అభద్రతాభావం సృష్టిస్తున్న వైకాపా’
ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు. -
‘మోదీ వేవ్’ ఎప్పుడూ ఉంటుంది: నవనీత్ రాణా
దేశంలో ‘మోదీ వేవ్’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్ రాణా బుధవారం స్పందించారు. -
‘ఆప్’ కా రామరాజ్య వెబ్సైట్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించింది.