దొంగ ఓట్లు.. నవరత్నాల్లో భాగమేనా?

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు...

Published : 18 Apr 2021 00:57 IST

నాదెండ్ల మనోహర్‌

అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పొరుగు జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చి దొంగోట్లు వేశారని ఆరోపించారు. అధికారులు, పోలీసుల సాయంతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. దొంగ ఓట్లు వేయడం కూడా నవరత్నాల్లో భాగమేనా? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. వైకాపా అక్రమాలపై భాజపాతో కలిసి ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని