Nadendla manohar: పాదయాత్రలు చేసి .. ముద్దులు పెట్టే పార్టీ కాదు మాది: నాదెండ్ల
జనసేన పార్టీ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనవరి 12న రణస్థలంలో యువశక్తి కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు.
శ్రీకాకుళం: పాదయాత్రలు చేసి.. ముద్దులు పెట్టే పార్టీ మాది కాదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువత కోసం జనవరి 12న రణస్థలంలో నిర్వహించనున్న యువశక్తి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను శ్రీకాకుళంలో నాదెండ్ల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ... జనసేన పార్టీ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లా యువత వలసలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేయడం వల్ల నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రచారం కోసం సిద్ధం చేసిన వారాహి వాహనంపై వైకాపా నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో పారదర్శకంగా ఉంటామని, ప్రజాక్షేత్రంలో పోరాడుతామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!