Temjen Imna: ‘ఓడి గెలిచే వారినే.. ఇలా అంటారు’ : ఎన్నికల ఫలితంపై తెమ్జెన్
నాగాలాండ్లో (Nagaland) భాజపా కూటమి రెండోసారి విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, మంత్రిగా ఉన్న తెమ్జెన్ ఇమ్నా (Temjen Imna Along) చేసిన ట్వీట్ అందర్నీ ఆకర్షించింది.
కొహిమా: ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ (Nagaland) అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-ఎన్డీపీపీ కూటమి మెజార్టీ సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఈ తరుణంలో ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తెమ్జెన్ ఇమ్నా అలోంగ్ (Temjen Imna Along) ఫలితం మీదే అందరి దృష్టి పడింది. ఓట్ల లెక్కింపు మొదలైన సమయంలో ఆయన వెనుకంజలో నిలవడం ఆ పార్టీని కలవరపరిచింది. తరువాతి రౌండ్లలో పుంజుకోవడంతోపాటు చివరకు విజయం సాధించడంతో ఊపిరిపీల్చుకుంది. ఫలితాలు వెల్లడయ్యే ఉత్కంఠ సమయంలోనూ ఈ సోషల్ మీడియా స్టార్ హాస్యంగా స్పందించిన తీరు అందర్నీ ఆకర్షించింది.
నాగాలాండ్లోని ఎలోంగ్టాకి నియోజకవర్గం నుంచి 2018లో పోటీ చేసిన తెమ్జెన్.. కేవలం 80కిపైగా ఓట్లతో విజయం సాధించారు. అలా మొదటిసారి గెలవడంతోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉన్నతవిద్య, గిరిజన వ్యవహారాల శాఖ బాధ్యతలు చూస్తోన్న ఆయన.. తాజా ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, మార్చి 2న జరిగిన ఓట్ల లెక్కింపు మొదలైన వెంటనే తెమ్జెన్ వెనుకంజలో కొనసాగడం కనిపించింది. దీనిపై స్పందిస్తూ.. ‘ఓడి గెలిచే వారిని.. ఇలా అంటారు’ అంటూ షారుఖ్ ఖాన్ నటించిన ‘బాజీగర్’ సినిమా డైలాగ్ను ట్వీట్చేశారు. అలా తర్వాతి రౌండ్లలో పుంజుకున్న ఆయన.. తన ప్రత్యర్థిపై సుమారు 4వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తన వ్యక్తిగత విషయాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రకృతి అందాలను తనదైన శైలిలో వివరించే తెమ్జెన్ ఇమ్నా అలోంగ్ (Temjen Imna Along) సోషల్ మీడియాలో స్టార్గా మారారు. ఇటీవల ఆయనపై ప్రధాని మోదీ (Modi) కూడా ప్రశంసలు కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగాలాండ్లో పర్యటించిన మోదీ.. ‘మన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చెప్పిన విషయాలు దేశమంతా వినిపిస్తున్నాయి. వాటిని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన డిజిటల్ వేదికగా నాగాలాండ్, ఈశాన్య భారతాన్ని అందంగా పరిచయం చేస్తున్నారు. నేను ఆయన పెట్టిన ప్రతి పోస్టును చూసేందుకు ప్రయత్నిస్తుంటాను’ అని ప్రశంసలు గుప్పించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు
సీఎం జగన్పై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. -
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. -
రాయి దాడి కేసు.. బీసీ యువకులను బెదిరిస్తున్నారు: కేశినేని చిన్ని
గులకరాయి దాడి కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో తెదేపాపై కుట్ర పన్నారని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపించారు. -
గులకరాయి డ్రామా.. జగన్లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి: అచ్చెన్నాయుడు
సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ..
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్.. మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. -
రాష్ట్రానికి విజనరీ కావాలా.. ప్రిజనరీ కావాలా?
ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి; నీతికి, అవినీతికి; టూరిజానికి, శాడిజానికి; విజనరీకి, ప్రిజనరీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
త్రిమూర్తులుపై వేటా.. సీటా..?
దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైకాపా తప్పిస్తుందా..? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. -
ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయం
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తంచేశారు. -
మంత్రి పెద్దిరెడ్డిది అవినీతి సామ్రాజ్యం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ల్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
నాకే పాపం తెలియదు
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిడు, కడప: వివేకా హత్య కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పునరుద్ఘాటించారు. -
175కు 175 స్థానాలూ ఇవ్వండి
‘రాష్ట్రంలో 58 నెలల మా పాలనా కాలంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు, నాలుగు సీ పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయాలు ప్రారంభించి పనులు చేయిస్తున్నాం. -
గొడ్డలిని వదిలేసి గులకరాయి వాడినందుకే కథ అడ్డం తిరిగింది
వైకాపా ట్రేడ్మార్క్ గొడ్డలిని వదిలేసి గులకరాయిని వాడినందుకే కథ అడ్డం తిరిగిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. -
సీఎంపై రాయి దాడి ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోండి
ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడి ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. -
అభివృద్ధి వికేంద్రీకరణ.. అమరావతిలో రాజధాని
ప్రజల ఎజెండా కోసమే సీపీఎం పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. -
దళితుల ఆశీస్సులున్నంత వరకూ.. ఏ కటకటాలూ ఆపలేవు..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో దళితుల ఆశీస్సులు ఉన్నంతవరకూ తనను ఏ కటకటాలూ ఆపలేవని, ఎవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. -
కోడ్ ఉండగా వైకాపా వాళ్లు ధర్నాలెలా చేస్తారు?
సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన రోజున వైకాపా వాళ్లు రహదారులపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని తెదేపా నేతలు తెలిపారు. -
తోట త్రిమూర్తులును వైకాపా నుంచి బహిష్కరించాలి
దళితులపై ఏమాత్రం గౌరవమున్నా శిరోముండనం కేసులో 18 నెలల శిక్ష పడిన తోట త్రిమూర్తులును వైకాపా నుంచి బహిష్కరించాలని తెదేపా మాజీ మంత్రి కేఎస్ జవహర్ డిమాండు చేశారు. -
గ్రంధి శీనన్న లోకల్ హీరో అట!.. కారుమూరి మనసు వెన్నట!
మమకారం పంచే గోదావరి జిల్లాలు.. వెటకారానికీ పెట్టింది పేరు. ‘అయ్యబాబోయ్...చాలా గొప్పోరు అండి మీరు’ అంటే అందులో చాలా వెటకారం ధ్వనిస్తుంది. -
ఆ 8 మంది అధికారులను ఏపీ నుంచి తప్పించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరగడానికి 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. -
జే గ్యాంగ్ బెదిరింపులతోనే అరబిందో ఇన్ఫ్రాకు కాకినాడ పోర్టు
దేశంలో ఎక్కడా పోర్టులు నిర్మించిన, నిర్వహించిన అనుభవం లేని.. కనీసం పోర్టు గోడలకు రంగులు కూడా వేయని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన అరబిందో ఇన్ఫ్రాకు అత్యంత కీలకమైన కాకినాడ పోర్టును ఎలా కట్టబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. -
ఎన్డీయే ప్రచారానికి ఎన్నారైలు సిద్ధం
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కమిటీల్లోనూ ప్రవాసాంధ్రులకు సముచిత స్థానం కల్పిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
-
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు
-
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
-
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
-
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు