సాగర్‌ ఉప ఎన్నిక: తెదేపా అభ్యర్థి పేరు ఖరారు

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిగా మొవ్వ అరుణ్‌ కుమార్‌ను బరిలో..

Updated : 23 Feb 2021 04:06 IST

హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్‌.రమణ

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు తెదేపా అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి తమ పార్టీ తరఫు అభ్యర్థిగా మొవ్వ అరుణ్‌ కుమార్‌ను బరిలో దించుతున్నట్టు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌ కుమార్‌ వెల్లడించారు. అలాగే, హైదరాబాద్‌ -రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎల్‌.రమణను అభ్యర్థిగా ప్రకటించారు. మంగళవారం ఆయన నామినేషన్‌ వేస్తారని అరవింద్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం అరవింద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ తెలంగాణ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. దేశంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని