YS Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. షర్మిలతో పాటు మరో ఆరుగురు నేతలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రగతిభవన్ ముట్టడికి కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్ వాహనంతో లిఫ్ట్ చేసి తరలించారు. ఈక్రమంలో జరిగిన ఘటనకు సంబంధించి.. షర్మిలతో పాటు మరో ఆరుగురు వైతెపా నేతలపై గుమిగూడటం, అక్రమ నిర్బంధం, పరుష పదజాలం, పబ్లిక్ న్యూసెన్స్, బెదిరింపు, మహిళలను దూషించడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంపై ఐపీసీ 143, 341, 290, 506, 509, 353, 149 సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
షర్మిలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని అమె తరఫు న్యాయవాదులు వాదించారు. శాంతి యుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసులు అరెస్టు చేసిన తీరును తప్పుబట్టారు. పోలీసు విధులకు ఎక్కడా ఆటంకం కలిగించలేదని తెలిపారు. శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదముందనే అదుపులోకి తీసుకున్నామని పోలీసుల తరఫు న్యాయవాది తెలిపారు. ఈ సమయంలో రిమాండ్ విధించకపోతే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశముందని వాదించారు. విధినిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించారని, పోలీసు అధికారుల వస్తువులను సైతం లాక్కొనే ప్రయత్నం చేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. దాదాపు 2గంటల పాటు ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి షర్మిలతో పాటు మరో ఆరుగురు వైతెపా నేతలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. పాదయాత్ర విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని ఆదేశించారు. బెయిల్ మంజూరు కావడంతో షర్మిల నాంపల్లి కోర్టు నుంచి లోటస్పాండ్లోని తన నివాసానికి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్