జగన్ అంతరాత్మతో మాట్లాడాలి: లోకేశ్‌

ఏపీ సీఎం జగన్ ఆత్మలతో కాకుండా అంతరాత్మతో మాట్లాడి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 30 Jun 2021 11:00 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఆత్మలతో కాకుండా అంతరాత్మతో మాట్లాడి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ‘‘జగన్‌ అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం కాసేపు ఆపి మంత్రులు, అధికారులతో మాట్లాడితే కొంతవరకైనా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులను నిలువునా ముంచేసిన ‘జాబ్‌ లెస్‌’ క్యాలెండర్‌ రద్దు చేయాలి. పాదయాత్రలో హామీ ఇచ్చినట్లు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో కొత్త జాబ్‌ క్యాలెండర్ విడుదల చేయాలి’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని