Nara Lokesh: మహనీయులను అవమానించి జగన్‌ రాక్షసానందం: నారా లోకేశ్‌

సీఎం జగన్‌కు పేర్ల మార్పు పిచ్చి పరాకాష్ఠకు చేరిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. మహనీయులను అవమానించి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.

Published : 08 Oct 2022 01:10 IST

అమరావతి: సీఎం జగన్‌కు పేర్ల మార్పు పిచ్చి పరాకాష్ఠకు చేరిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. మహనీయులను అవమానించి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేశారని.. నేడు విజయనగరంలో ఉన్న మహారాజా జిల్లా ప్రభుత్వాసుపత్రి పేరు మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని దుయ్యబట్టారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. 

మహారాజా కుటుంబం విజయనగరం నడిబొడ్డున విలువైన భూమిని ఆస్పత్రి కోసం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెదేపా సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఆస్పత్రిని అన్ని వసతులతో అభివృద్ధి చేశారని చెప్పారు. రాత్రికి రాత్రే ఆస్పత్రికి మహారాజా పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మహారాజా పేరునే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని