గతంలో నీతి కబుర్లు..ఇప్పుడు పన్నులు: లోకేశ్‌ 

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దూసుకెళుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

Published : 17 Jul 2021 14:54 IST

అమరావతి: ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దూసుకెళుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వ్యాట్‌, అదనపు వ్యాట్‌, సుంకం పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెరిగిన పెట్రోల్‌ ధరలపై నీతి కబుర్లు చెప్పిన సీఎం జగన్‌.. అధికారం చేపట్టిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు ఎందుకు తగ్గించట్లేదని నిలదీశారు. ఇతర రాష్ట్రాల పెట్రోల్‌ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధర బోర్డులు పెట్టారని చెప్పారు. రాష్ట్ర పన్నుల భారం తగ్గించి తక్కువ ధరలకు అందించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు