Andhra News: మీ ఆర్భాటాల కోసం శిశువుల్ని చంపడం శిశు సంక్షేమమా?: లోకేశ్‌

అనంతపురం జిల్లాలో పోలీసుల వైఖరి వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ‘‘మంత్రి ఉషశ్రీ పర్యటనలో పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఇది ముమ్మాటికీ మంత్రి, పోలీసులు

Updated : 16 Apr 2022 08:37 IST

అమరావతి: అనంతపురం జిల్లాలో పోలీసుల వైఖరి వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ‘‘మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ పర్యటనలో పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఇది ముమ్మాటికీ మంత్రి, పోలీసులు చేసిన హత్యే. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్నా పోలీసులు వదల్లేదు. మీ ఆర్భాటాల కోసం శిశువులను చంపడం శిశు సంక్షేమమా?’’ అని లోకేశ్ ప్రశ్నించారు.

నిన్న రాత్రి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మంత్రి ఉషశ్రీచరణ్‌ ర్యాలీగా వస్తున్న కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో సకాలంలో చికిత్స అందక తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని