Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు ఎలైన్మెంట్ వ్యవహారంపై గతేడాది నమోదుచేసిన కేసులో ఆయన పేరును తాజాగా సీఐడీ చేర్చింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ అధికారులు మంగళవారం మెమో సమర్పించారు. ఈ కేసులో ఏ 14గా లోకేశ్ను పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అరెస్టై ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబుపై ఇటీవలే ఇన్నర్ రింగ్రోడ్డు ఎలైన్మెంట్ కేసులో సీఐడీ అధికారులు పీటీ వారంట్ దాఖలుచేశారు. దానిపై విచారణ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ దశలో అదే కేసులో ఇప్పుడు లోకేశ్నూ నిందితుడిగా చేర్చారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో యువగళం పాదయాత్రను తాత్కాలికంగా నిలిపేసిన లోకేశ్.. ఈ యాత్రను ఆగినచోటి నుంచే ఈ నెల 29న మళ్లీ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది నమోదైన ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో ఇప్పటికప్పుడు లోకేశ్ను నిందితుడిగా చేర్చడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా అక్రమ కేసులన్నింటినీ తెరపైకి తీసుకొచ్చి వాటిని చంద్రబాబు, లోకేశ్ల మెడకు చుట్టడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని తెదేపా ఆరోపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుపాను బాధితులకు భోజనమూ పెట్టలేరా?
తుపాను బాధిత ప్రజలకు తక్షణ అవసరాలైన ఆహారం, నీళ్లు, పునరావాసం కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
తుపాను సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం
తుపాను తీవ్రతపై కేంద్ర సంస్థలు వారం నుంచే హెచ్చరికలు జారీ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షించకపోవడం దారుణమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. -
హామీలు గుర్తుచేస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు
ప్రశ్నిస్తే స్వపక్షమైనా వైకాపా చేతిలో బాధితులుగా మిగలాల్సిందే. సీఎం జగన్ సొంత జిల్లా వైయస్ఆర్లో ఖాజీపేట మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చంద్రభాస్కర్రెడ్డిని.. వైకాపా నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. -
జగన్ నిర్లక్ష్య వైఖరితో రైతులకు నష్టం
ప్రస్తుత తుపాను కారణంగా రైతులు, ప్రజలు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ముంపు బాధితులను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు
మిగ్జాం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు బాపట్ల రాజీవ్గాంధీ కాలనీలో భాగమైన ఎస్టీ కాలనీ ముంపునకు గురైంది. -
తుపాను సహాయక చర్యల్లో పాల్గొనండి
మిగ్జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని భాజపా శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపునిచ్చారు. -
ఏపీలో పంచాయతీలకు అందని ఆర్థిక సంఘం నిధులు
ఆర్థిక సంఘం 2019 నుంచి 2023 వరకు స్థానిక సంస్థల కోసం రూ.8,629 కోట్ల నిధులు విడుదల చేసినా అవేవీ స్థానిక సంస్థల ఖాతాలకు చేరలేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
తుపానుతో నష్టపోయిన రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవాలి
మిగ్జాం తుపానుతో నష్టపోయిన రాష్ట్రాలకు.. కేంద్రం పూర్తి సహాకారాన్ని అందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. -
ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లు ఇవ్వాలి: సీపీఐ
మిగ్జాం తుపాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల కోసం ఒక్కో జిల్లాకు కనీసం రూ.10 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు. -
తుపాను ఉపశమన చర్యలకు రూ.5 వేల కోట్లు ఇవ్వండి: గల్లా జయదేవ్
మిగ్జాం తుపానుతో రాష్ట్రంలో పంటలు, రహదారులు, భవనాలు ధ్వంసమయ్యాయని, విద్యుత్ స్తంభాలు నెలకూలి సరఫరాకు అంతరాయం కలిగినందున తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టేందుకు రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ తీర్పుతో జగన్కు కనువిప్పు కలగాలి
తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా ఏపీ సీఎం జగన్కు కనువిప్పు కలగాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ హితవు పలికారు. -
వృత్తికి ద్రోహం చేసి న్యాయస్థానాల్లో స్టేలు తెచ్చుకోవడం సిగ్గుచేటు: బొండా ఉమా
వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కావాలంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) అక్టోబరు 23న జారీ చేసిన నోటీసులపై ఆయన ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. -
బల్క్గా ఫారం-7 దరఖాస్తుల స్వీకరణ ఆపాలి
పలు నియోజకవర్గాల్లో నిబంధనలకు విరుద్ధంగా బల్క్గా ఫారం-7లు స్వీకరిస్తున్నారని.. ఆ పోకడను వెంటనే నిలువరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాను తెదేపా నేతలు కోరారు. -
‘గోమూత్ర’ రాష్ట్రాల్లోనే భాజపా గెలుస్తుంది
భాజపాను ఉద్దేశించి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ లోక్సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిందీ రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలుగా అభివర్ణిస్తూ అక్కడ మాత్రమే కాషాయ దళం గెలువగలదని పేర్కొన్నారు. -
70 ఏళ్ల అలవాటు.. తేలిగ్గా పోతుందా!
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాలపై భాజపా, కాంగ్రెస్ మధ్య సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. -
ఇండియా భేటీ వాయిదా
దేశ రాజధాని దిల్లీలో బుధవారం నిర్వహించాల్సిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతల సమావేశం ఈ నెల మూడో వారానికి వాయిదా పడింది. బుధవారం నాటి సమావేశానికి తాను హాజరు కాలేనని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. విమర్శలు రావడంతో క్షమాపణ
డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు.


తాజా వార్తలు (Latest News)
-
Cyclones: ఏపీలో అయిదు దశాబ్దాల్లో 60 తుపాన్లు
-
Vijayawada: నేడూ విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు
-
Congress: కొత్త ఎమ్మెల్యేలకు చిన్నారెడ్డి, నాగేశ్వర్ పాఠాలు
-
Donakonda: అబ్బో.. దొనకొండపై ప్రేమే!
-
Malkajgiri: మల్కాజిగిరి సెంటిమెంట్.. మూడు ఎన్నికల్లో సంచలనాలు
-
Sircilla: సిరిసిల్లలో పాత కథ పునరావృతం