ప్రభుత్వ నిర్లక్ష్యమే అస్వస్థతకు కారణం: లోకేశ్‌

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

Published : 07 Dec 2020 00:53 IST

అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రజలు ఒక్కసారిగా మూర్ఛ తదితర లక్షణాలతో అనారోగ్యం బారిన పడ్డారని ఆయన వివరించారు. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని ఆయన అన్నారు. వైద్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు భరోసా లేకపోతే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల పరిస్థితి తలచుకుంటే ఆందోళనగా ఉందని లోకేశ్‌ తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని