Yuvagalam Padayatra: రాయలసీమ కష్టాలు చూశా.. కన్నీళ్లు తుడుస్తా: నారా లోకేశ్
యువగళం పాదయాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడపలో ‘మిషన్ రాయలసీమ’ పేరుతో రాయలసీమ సమస్యలపై చర్చా వేదిక నిర్వహించారు.
కడప: యువగళం పాదయాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడపలో ‘మిషన్ రాయలసీమ’ పేరుతో రాయలసీమ సమస్యలపై చర్చా వేదిక నిర్వహించారు. ప్రొఫెసర్ రాజేశ్ చర్చా వేదికలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ‘సీమ కష్టాలు చూశా.. సీమ కన్నీళ్లు తుడుస్తా’నని ప్రకటించారు. రాయలసీమలో తెదేపాకు తక్కువ సీట్లు వచ్చినా తక్కువగా చూడలేదన్న లోకేశ్.. మొత్తం రాయలసీమను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. రాయలసీమకు పరిశ్రమలు తీసుకొచ్చిన పార్టీ తెదేపా అని గుర్తు చేశారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వైకాపా నేతలు అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. వైకాపాకు ఇచ్చినన్ని సీట్లు తెదేపాకు ఇస్తే.. చెప్పింది చేసి చూపిస్తామన్నారు.
పరిశ్రమలకు పెద్దపీట..
సీమ జిల్లాలను ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్గా మారుస్తాం. దగ్గర్లో ఉన్న బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లను వినియోగించుకొని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. పెద్ద ఎత్తున ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాయలసీమలో ఉన్న మైనింగ్ పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తాం. మైనింగ్లో కేవలం మెటీరియల్ ఉత్పత్తి మాత్రమే కాకుండా ఫైనల్ ప్రొడక్ట్ తయారీ వరకు వాల్యూ చైన్ మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. మైనింగ్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్డ్ పనులు కూడా మన రాష్ట్రం వాళ్లే చేసే విధంగా నైపుణ్య శిక్షణ ఇస్తాం. సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ తయారు చేసే కంపెనీలను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొస్తాం.
రైతులకు హామీలు..
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తాం. సీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీని, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సహిస్తాం. 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్, వివిధ ఉద్యాన పంటలకు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. దేశానికి, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు ఎగుమతి చేయడం, కొత్త రకాల మొక్కలు తయారు చేసే విధంగా రీసెర్చ్ సెంటర్లు పనిచేస్తాయి. టొమాటో వాల్యూ చైన్ ఏర్పాటు చేసి.. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పించడం, వ్యవసాయానికి వినియోగించే యంత్రాలు, పరికరాలు ఏపీలోనే తయారు చేసి తక్కువ ధరకే సబ్సిడీలో రైతులకు అందిస్తాం.
సీడ్ హబ్గా ఏపీని మార్చడం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. పాత బీమా పథకాన్ని అమలు చేస్తాం. రైతు బజార్ల సంఖ్య పెంచుతాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసే విషయంలో ప్రభుత్వం నుంచి సలహాలు అందిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్, పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులను గుర్తించి భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాయం అందిస్తాం’’ అని నారా లోకేశ్ ప్రకటించారు.
స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా రాయలసీమ
‘‘వాటర్ గ్రిడ్ ద్వారా సీమలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం. పాడి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. పశువుల కొనుగోలు నుంచి మేత, మందుల వరకు రాయితీ అందజేస్తాం. గొర్రెలు, మేకల పెంపకానికి ప్రత్యేక సాయం ఇస్తాం. ఉచితంగా గొర్రెలు, మేకల పంపిణీ కార్యక్రమం చేపడుతాం. పశువుల మేత కోసం బంజరు భూములు కేటాయిస్తాం. ఫార్మ్స్ ఏర్పాటుకు రాయితీ రుణాలు అందజేస్తాం. స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా రాయలసీమను తీర్చిదిద్దుతాం. అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపడమే లక్ష్యంగా రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. అన్ని రకాల క్రీడలకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీలు, స్టేడియాలు ఏర్పాటు చేస్తాం’’ అని లోకేశ్ హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు.