Nara Lokesh: ఏపీ పరువు తీసేలా వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవర్తించలేదు: లోకేశ్
నంద్యాల నియోజకవర్గంలో నారాలోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా న్యాయవాదులు, జర్నలిస్టులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు సహా పలు వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలతో లోకేశ్ భేటీ అయ్యారు.
నంద్యాల: నంద్యాల నియోజకవర్గంలో నారాలోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా న్యాయవాదులు, జర్నలిస్టులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు సహా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలతో లోకేశ్ భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించిన లోకేశ్.. అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న అంశాలపై వారితో చర్చించారు.
అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ.. ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎందుకు నివాళులర్పించారని అని కొందరు నన్ను అడుగుతున్నారు. వైఎస్ తీసుకున్న అన్ని నిర్ణయాలతో ఏకీభవించను. కానీ, ఆయన ఏనాడూ రాష్ట్ర పరువు తీసేలా ప్రవర్తించలేదు. వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రం పరువు తీశారు. తెదేపా అధినేత చంద్రబాబు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నింటినీ వైఎస్ కొనసాగించారు. దక్షిణ భారతదేశ బిహార్గా రాష్ట్రాన్ని జగన్ మార్చేశారు. ఆఖరికి మీడియా ప్రతినిధులపైనా జగన్ అండ్ కో దాడులకు తెగబడుతున్నారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టి అవమానించారు. న్యాయవాదులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు.. ఇలా అందరూ జగన్ బాధితులే. ఈ విషయాలపై ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించాలి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెదేపాకు 14 సీట్లు ఇవ్వండి..
ఫాక్స్కాన్ సంస్థను ఏపీకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు ఆ సంస్థని జగన్ తెలంగాణకు తరిమేశారు. దీని వల్ల లక్ష మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. 2014లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించినప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2019లో క్లీన్ స్వీప్ చేసిన వైకాపా కర్నూలుకు ఏం చేసిందో మీరు ఆలోచించండి. 2024లో తెదేపాకు 14 సీట్లు ఇవ్వండి. కర్నూలుని నంబర్ వన్ చేసి చూపిస్తాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో హాస్టల్ ఛార్జీలు పెంచడం దారుణం. వైద్య విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు, దూది లేని పరిస్థితి నెలకొంది. జగన్ పాలనలో ఇదయ్యా దుస్థితి. కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం. అవసరమైన డాక్టర్లు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.
న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. జగన్ మాదిరిగా దొంగ హామీలు ఇచ్చి మోసం చేయం. కోర్టుల్లో కనీస మౌలిక వసతులు లేక న్యాయవాదులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెదేపా హయాంలో కొత్త భవనాల నిర్మాణం కోసం పనులు ప్రారంభించాం. వాటిని వైకాపా ప్రభుత్వం ఆపేసింది. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ వ్యవస్థకు అధిక నిధులు కేటాయించి మౌలిక వసతులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. న్యాయవాదులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.
పింక్ కాలర్ జాబ్స్ ఎక్కువగా కల్పిస్తాం..
ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అన్న జగన్.. ఆ హామీ మర్చిపోయారు. రూ.లక్షలు ఖర్చు చేసి ట్రైనింగ్ తీసుకొని నోటిఫికేషన్ రాక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది యువకులు రాష్ట్రంలో ఉన్నారు. తెదేపా హయాంలో డీఎస్సీని క్రమం తప్పకుండా నిర్వహించాం. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు, స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలని తెదేపా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు పెద్ద ఎత్తున ఏపీకి తెచ్చింది చంద్రబాబు. ఈ రెండు రంగాలను ప్రోత్సహిస్తేనే ఇంజినీరింగ్ విభాగంలోని ఇతర ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు (పింక్ కాలర్ జాబ్స్) కల్పిస్తాం.
యూట్యూబ్ ఛానెల్స్ వారికి అక్రిడేషన్ సౌకర్యం..
జర్నలిస్టులను కూడా వైకాపా ప్రభుత్వం అనేక విధాలుగా వేధిస్తోంది. ఏవేవో జీవోలు తీసుకొచ్చి జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారు. వేదింపులకు గురి చేయడమే కాకుండా అరెస్టులు చేస్తున్నారు. జర్నలిస్టులను ఇబ్బంది పెట్టే విధంగా తీసుకొచ్చిన జీవోలను రద్దు చేస్తాం. ఇళ్ల గురించి అడిగితే సజ్జల జర్నలిస్టులపై దాడి చేశారు. ఆఖరికి అక్రిడేషన్ కార్డులు కూడా రద్దు చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, టిడ్కో ఇళ్లు ఇస్తాం. ప్రస్తతం యూట్యూబ్ ఛానెల్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. వాటికి కొన్ని నిబంధనలు, షరతులు పెట్టి వారికి కూడా అక్రిడేషన్ సౌకర్యం కల్పిస్తాం’’ అని లోకేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. -
దుష్ట పాలనను అంతం చేద్దాం
శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. -
ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!
అయిదేళ్లలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. -
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్