
Navjot Sidhu: ఆప్ ప్రభుత్వంపై నవజ్యోత్సింగ్ మళ్లీ ప్రశంసలు..!
దిల్లీ: పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ.. అందుకు గల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమైంది. ఇదే సమయంలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్సింగ్ సిద్ధూ.. సొంత పార్టీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్కు శుభాకాంక్షలు తెలిపిన సిద్ధూ.. పంజాబ్లో మాఫియా వ్యతిరేక శకానికి తెరలేపారంటూ ఆమ్ఆద్మీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
‘‘పంజాబ్లో మాఫియా వ్యతిరేక నూతన శకానికి తెరలేపిన భగవంత్ మాన్పై ఎన్నో ఆశలు ఉన్నాయి. ప్రజా అనుకూల విధానాలతో పంజాబ్ను పునరుజ్జీవన పథంలోకి తీసుకువస్తారని ఆశిస్తున్నా’’ అని పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన ముఖ్యమంత్రికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఇలా ఆప్ ప్రభుత్వంపై వరుసగా పొగడ్తలు కురిపించడంపై సొంతపార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్లో ఫలితాలు వెల్లడైన వెంటనే స్పందించిన సిద్ధూ.. నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పంజాబ్ ప్రజలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రజాతీర్పును గౌరవించాలన్న ఆయన.. ప్రజా వాక్కే దైవవాక్కు అంటూ పేర్కొనడం వంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు మింగుడుపడడం లేదు.
ఇదిలా ఉంటే, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి చెందడంపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం జరుపుతోంది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల పీసీసీలను తప్పించిన పార్టీ అధిష్ఠానం కొత్తవారికి బాధ్యతలు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యింది. ఇదే సమయంలో కాంగ్రెస్లో రెబల్ నేతలుగా మారిన జీ-23 బృంద సభ్యులు కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీలో సంస్థాగత మార్పులకు సంబంధించి జీ-23 నేతల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నంలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND VS WI: వెస్టిండీస్తో వన్డేలకు భారత జట్టు ఇదే
-
World News
North Korea: దక్షిణ కొరియాను మరోసారి ఇబ్బంది పెట్టిన ఉత్తర కొరియా
-
Politics News
Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
-
India News
Mukhtar Abbas Naqvi: కేంద్ర మంత్రి నఖ్వీ రాజీనామా.. ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశం?
-
India News
Gold Ornaments: 43 సవర్ల బంగారం తెచ్చి.. ఏటీఎం చెత్తబుట్టలో వేసి..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!