Navjot Sidhu: ఆస్తి కోసం తల్లినే గెంటేశాడు.. సిద్ధూపై సోదరి సంచలన వ్యాఖ్యలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని......
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని ఆరోపించారు. సిద్ధూ తండ్రి మొదటి భార్య కుమార్తె అయిన ప్రవాస భారతీయురాలు సుమన్ తూర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన తల్లి పడిన కష్టాలను వివరిస్తూ పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు.
కొద్దిరోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన అనంతరం సుమన్ తూర్ శుక్రవారం చండీగఢ్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్ధూపై తీవ్ర ఆరోపణలు చేశారు. కఠినాత్ముడంటూ వర్ణించారు. ‘1986లో మా తండ్రి భగవత్ సింగ్ సిద్ధూ మృతిచెందిన అనంతరం మా కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కుటుంబ ఆస్తిని దక్కించుకునేందుకు నన్ను, మా తల్లిని సిద్ధూ ఇంట్లోంచి గెంటేశాడు. మా పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. నా తల్లి నాలుగు నెలలు ఆసుపత్రికే పరిమితమైంది. 1989లో దిక్కులేనిదానిలా దిల్లీ రైల్వేస్టేషన్లో మరణించింది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
1987లో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోయారని సిద్ధూ అబద్ధం చెప్పాడని సుమన్ పేర్కొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిందంతా అబద్ధమని ఆమె ఆరోపించారు. తన తల్లి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకే ఇప్పుడు భారత్కు వచ్చినట్లు సుమన్ తెలిపారు. తన తల్లికి న్యాయం కావాలని కోరారు. జనవరి 20న అమృత్సర్లోని సిద్ధూ ఇంటికి వెళ్లానని కానీ.. గేటు తీసేందుకు కూడా తన సోదరుడు అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ నంబర్ను కూడా బ్లాక్ చేసినట్లు తెలిపారు.
కొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో సిద్ధూపై ఇలాంటి విమర్శలు రావటం అక్కడి రాజకీయాల్లో కలకలం రేపుతోంది. పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీతోపాటు సిద్ధూ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే సీఎం అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ గురువారం తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకొనే అభ్యర్థి పేరును వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే సోదరి ఆరోపణలు సిద్ధూ అభ్యర్థిత్వంపై ప్రభావం చూపనున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆమె ఎవరో కూడా నాకు తెలియదు: సిద్ధూ భార్య
సుమన్ ఆరోపణలను సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ కొట్టిపారేశారు. సిద్ధూ తండ్రి మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్న విషయం కూడా తనకు తెలియదు అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది