Punjab: గృహిణులకు నెలకు రూ.2వేల నగదు.. ఉచితంగా 8 గ్యాస్ సిలిండర్లు..!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ..
నవజోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల వరాలు
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. మహిళలకు ఎన్నికల వరాలు ప్రకటించారు. తమకు ఓటేసి గెలిపిస్తే గృహిణులకు ప్రతి నెలా రూ.2వేల నగదుతో పాటు.. ఏడాదికి 8 వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
బర్నాలా జిల్లాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సిద్ధూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే తాము మళ్లీ అధికారంలోకి వస్తే గృహిణులకు నెలకు రూ. 2వేల నగదుతో పాటు ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. అంతేగాక, బాలికల విద్య కోసం నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. ఐదో తరగతి పూర్తి చేసిన బాలికలు రూ. 5వేలు, పదో తరగతి పాసైన అమ్మాయిలకు రూ. 15వేలు, 12వ తరగతి పాసైన యువతులకు రూ. 20వేల నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. ఇక ఉన్నత విద్య కోసం అడ్మిషన్ తీసుకునే అమ్మాయిలకు ద్విచక్రవాహనాలు, కంప్యూటర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆస్తులను మహిళల పేరు మీదకు బదలాయిస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని అన్నారు. మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 28 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సిద్ధూ హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మహిళల కోసం ఇలాంటి హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. పంజాబ్లో తమకు ఓటేస్తే మహిళలందరికీ రూ.1000 నగదుతో పాటు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా అందిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
పంజాబ్ శాసనసభ గడువు మరో మూడు నెలల్లో ముగియనుంది. దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. మార్చి, ఏప్రిల్లో అక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. దీనిపై మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలను ముమ్మరం చేశాయి. గత కొంతకాలంగా పార్టీలో అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. అటు భాజపా కూడా ఈ సారి అధికారం కోసం గట్టిగానే శ్రమిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి సొంతంగా పార్టీ స్థాపించిన సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో కాషాయ పార్టీ పొత్తు పెట్టుకుంది. మరోవైపు ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి ఉత్సాహంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానని చెప్పారు. -
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్ర మరో లేఖ రాశారు. సీఎంపై రాయి దాడి కేసులో బొండా ఉమాను ఇరికించేలా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. -
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు