Navjot Singh Sidhu: సీఎంతో భేటీ కానున్న సిద్ధూ.. రాజీనామాపై వెనక్కి తగ్గేనా?
సంక్షోభంలో కూరుకుపోయిన పంజాబ్ కాంగ్రెస్లో పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి అనూహ్యంగా రాజీనామా చేసి పార్టీలో
చండీగఢ్: సంక్షోభంలో కూరుకుపోయిన పంజాబ్ కాంగ్రెస్లో పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి అనూహ్యంగా రాజీనామా చేసి పార్టీలో అలజడి సృష్టించారు నవజోత్ సింగ్ సిద్ధూ. ఆయన రాజీనామాను కాంగ్రెస్ ఇంకా ఆమోదించలేదు. అయితే సిద్ధూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సంకేతాలు కన్పిస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీతో సిద్ధూ భేటీ కానున్నారు.
ఈ విషయాన్ని సిద్ధూ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించడం విశేషం. ‘‘చర్చల కోసం సీఎం నన్ను ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు చండీగఢ్లోని పంజాబ్ భవన్లో మేం భేటీ కానున్నాం. ఎలాంటి చర్చలకైనా ఆయన్ను స్వాగతిస్తున్నా’’ అని సిద్ధూ ట్వీట్ చేశారు. సీఎం చన్నీ బుధవారం సిద్ధూతో ఫోన్లో మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సీఎం కోరగా.. అందుకు సిద్ధూ అంగీకరించారు.
ఇదిలా ఉండగా.. రాజీనామాపై సిద్ధూ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. పంజాబ్ పీసీసీ చీఫ్గా సిద్ధూనే కొనసాగుతారని, ఆయన నేతృత్వంలోనే వచ్చే ఏడాది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని సదరు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం జరగబోయే సిద్ధూ-చన్నీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!