NCP: ఎన్సీపీ జాతీయ బాధ్యతలకు సుప్రియ.. రాష్ట్ర వ్యవహారాలకు అజిత్ పేర్ల పరిశీలన..!
ఎన్సీపీకి కొత్త నాయకత్వం ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సుప్రియా, అజిత్ పేర్లను సూచించినట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
ఇంటర్నెట్డెస్క్: ఎన్సీపీ(NCP) అధ్యక్ష పదవికి సీనియర్ నేత శరద్ పవార్(Sharad Pawar) రాజీనామా చేయడంతో ఇప్పుడు వారసుల ఎంపిక మొదలైంది. పవార్ కుమార్తె సుప్రియా సూలే(Supriya Sule), సమీప బంధువు అజిత్పవార్(Ajit Pawar) పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి పేర్లను పార్టీ సీనియర్ నేత ఛగన్ భుజ్బల్ సిఫార్సు చేశారు. వీరిలో పార్లమెంట్ సభ్యురాలైన సుప్రియాను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని, అదే సమయంలో రాష్ట్ర బాధ్యతలను అజిత్కు అప్పగించాలని పేర్కొన్నారు. ఎన్సీపీ అధినాయకత్వ బాధ్యతల కోసం పేర్లను వెల్లడించడం ఇదే తొలిసారి. శరద్ పవార్ పదవిని వీడిన ఒక రోజు తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. నాయకత్వ ఎంపికకు ఎన్సీపీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో ఛగన్ కూడా సభ్యుడు.
ఈ సందర్భంగా భుజ్బల్ మాట్లాడుతూ ‘‘మేం శరద్ పవార్ రాజీనామా విరమించుకోవాలని కోరుకుంటున్నాం. కానీ, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. దీంతో సుప్రియాకు జాతీయ బాధ్యతలు అప్పగించి.. అజిత్ పవార్కు రాష్ట్ర బాధ్యతలను కట్టబెట్టాలని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. బుధవారం ఉదయం బాంద్రాలో విలేకర్లతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
పార్టీ నాయకత్వం ఎంపిక కమిటీలో ప్రఫుల్ పటేల్, సునీల్ తాట్కరే, కేకే శర్మ, పీసీ చాకో, అజిత్ పవార్, జయంత్ పాటిల్, సుప్రియా సూలే, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్, అనిల్ దేశ్ముఖ్, రాజేశ్ తోపే, జితేంద్ర అవధ్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, జయదేవ్ గైక్వాడ్ ఉండాలని నిన్న శరద్పవార్ సూచించారు.
మరోవైపు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జయంత్ రావ్ పాటిల్ తన పదవికి రాజీనామా సమర్పించినట్లు వార్తలొస్తున్నాయి. మరో నాయకుడు, పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్ కూడా ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని శరద్పవార్కు పంపినట్లు పేర్కొన్నారు.
పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ మంగళవారం రాజీనామా చేశారు. దీంతో పార్టీ శ్రేణులు కూడా రాజీనామాలు చేస్తామని హెచ్చరించగా.. మరికొంత మంది నిరాహార దీక్షలకు దిగుతామన్నారు. అయినా పవార్ తలొగ్గలేదు. అదే సమయంలో.. పార్టీలో క్రియాశీలకంగానే ఉంటానని, అధ్యక్ష పదవి నుంచి మాత్రమే వైదొలిగానని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా నిర్ణయంపై పునరాలోచించడానికి తనకు రెండు మూడు రోజుల సమయం కావాలని ఆయన కోరారని పార్టీ నేత అజిత్ పవార్ చెప్పడంతో కార్యకర్తలు ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
అమరావతి నుంచి సినీ నటి నవనీత్ రాణాకు భాజపా టికెట్
అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్ రాణా ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా