AAP: ‘ఆర్డినెన్స్’పై పోరాటం ముమ్మరం.. శరద్ పవార్తో కేజ్రీవాల్ భేటీ!
దిల్లీ పాలనావ్యవహారాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై అక్కడి ఆప్ ప్రభుత్వ పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు పవార్ను ముంబయిలో కలిసిన సందర్భంగా ఈ మేరకు మాట్లాడారు.
ముంబయి: దిల్లీ (Delhi)లో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్(Ordinance)పై ఆప్ ప్రభుత్వం తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఈ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆయా పార్టీల మద్దతు కూడగడుతోన్న దిల్లీ సీఎం, ఆప్ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. తాజాగా ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar)ను కలిశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann)తో కలిసి ముంబయికి వచ్చిన కేజ్రీవాల్.. ఇక్కడ పవార్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్పై పోరాటం విషయంలో శరద్ పవార్ తమకు మద్దతు పలికారని వెల్లడించారు.
ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలను ఆర్డినెన్సులను ఉపయోగించి పనిచేయనీయక పోవడం దేశానికి మంచిది కాదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య మనుగడ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఒకవేళ భాజపాయేతర పక్షాలన్నీ ఏకమైతే.. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను రాజ్యసభలో ఓడించవచ్చని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఆప్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేలా చూడటం మన కర్తవ్యమని శరద్ పవార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆర్డినెన్స్పై పోరులో భాగంగా కేజ్రీవాల్ ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తదితర నేతలతో సమావేశమయ్యారు.
‘ఇప్పుడు భాజపాకు ఎన్డీయే గుర్తొచ్చింది..’
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ‘ఎన్డీయే’ అనే అంశాన్ని భాజపా తెరపైకి తెచ్చిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 19 పార్టీలు బహిష్కరించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్డీయే పేరుతో ఓ ప్రకటన విడుదల చేసిందని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో సొంతంగా గెలవలేమని అర్థమైంది కాబట్టే భాజపాకు ఇప్పుడు భాగస్వామ్య పక్షాలు గుర్తొచ్చాయని దుయ్యబట్టారు. పార్లమెంట్లో ఎలాంటి చర్చలూ లేకుండా బిల్లులు ఆమోదించుకుంటున్న ఎన్డీయే సర్కారు.. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం సరికాదని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!