Kejriwal: కేంద్రం సహకారం.. ప్రధాని మోదీ ఆశీర్వాదం అవసరం: కేజ్రీవాల్
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)లో 15ఏళ్ల భాజపా(BJP) పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల ఆప్(AAP) జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హర్షం వ్యక్తంచేశారు.
దిల్లీ: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)లో ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల ఆప్(AAP) జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హర్షం వ్యక్తంచేశారు. తమ పార్టీకి ఘన విజయం అందించిన దిల్లీవాసులకు కృతజ్ఞతలు చెప్పారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(Muncipal corporation of Delhi) నిర్వహించే బాధ్యతను ‘మీ కొడుకు, సోదరుడి’కి అప్పగించినందుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. దిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో మార్పు తీసుకొచ్చినందుకు ప్రజలకు థాంక్స్ చెప్పిన కేజ్రీవాల్.. దిల్లీ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. దిల్లీ నగర పరిస్థితి మరింతగా మెరుగుపరిచేందుకు భాజపా, కాంగ్రెస్ పార్టీలతో పాటు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆశీర్వాదం కావాలన్నారు. పరిశుభ్రమైన నగరంగా దిల్లీని తీర్చిదిద్దేందుకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్, భాజపా, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించి అవినీతి రహితంగా మారుస్తామన్నారు. తమ తీర్పుతో ఈరోజు దిల్లీ ప్రజలు యావత్ దేశానికి ఓ సందేశం ఇచ్చారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అంతకముందు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ఆప్ను గెలిపిస్తూ తీర్పు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఆప్కు ఇచ్చింది కేవలం విజయం మాత్రమే కాదని.. దిల్లీని మరింత పరిశుభ్రంగా, మెరుగైన నగరంగా తీర్చిదిద్దే అతిపెద్ద బాధ్యత అన్నారు.
ఆప్ కార్యాలయం వద్ద కోలాహలం
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తల హర్షాతిరేకాలు, పాటలతో సందడి చేశారు. అక్కడికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పార్టీ జెండాలు పట్టుకొని మిఠాయిలు పంచుకుంటూ నృత్యాలతో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం వంటి నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. 130కి పైగా స్థానాల్లో గెలుచుకొని మేయర్ పీఠాన్నికైవసం చేసుకుంది. ఈ నెల 4న దిల్లీ కార్పొరేషన్లోని 250 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 100కు పైగా స్థానాల్లో భాజపా గెలవగా.. కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
ప్రపంచంలోని అన్ని కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత తనదేనని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. -
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. -
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. -
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ రూ.1,823 కోట్లు చెల్లించాలని పార్టీకి ఐటీ నోటీసు రావడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. -
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
₹1,823 కోట్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. శనివారం (మార్చి 30న) దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరింది. -
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు
తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. -
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు