ఫలితాలు రాకముందే.. అభ్యర్థులు రిసార్టులకు!

అసోంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘మహాజోత్‌’కూటమిలో పొత్తులో ఉన్న బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌(బీపీఎఫ్‌)కు చెందిన 9మంది అభ్యర్థులు

Published : 14 Apr 2021 10:22 IST

రాయ్‌పూర్‌: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘మహాజోత్‌’కూటమిలో ఉన్న బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌(బీపీఎఫ్‌)కు చెందిన 9మంది అభ్యర్థులు ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌కు తరలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు మీడియాకు ధ్రువీకరించారు. ‘అస్సాంకు చెందిన 9 మంది బీపీఎఫ్‌ అభ్యర్థులు శనివారం సాయంత్రమే రాయ్‌పూర్‌కు చేరుకున్నారు. వారిని నయారాయ్‌పూర్‌లోని ఓ రిసార్టుకు తరలించారు. అందులో బీపీఎఫ్‌ అభ్యర్థులతో పాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా ఉన్నారు. వారంతా మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు రాయ్‌పూర్‌లోనే ఉంటారు’ అని ఆయన వెల్లడించారు.

అస్సాం శాసనసభలోని 126 స్థానాలకు ఏప్రిల్‌ 6వ తేదీన ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీపీఎఫ్‌, ఏఐయూడీఎఫ్‌, సీపీఐ(ఎం) పార్టీలు కాంగ్రెస్‌ నేతృత్వంలో ‘మహాజోత్‌’ పేరుతో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి. బీపీఎఫ్‌ తరపున 12 మంది అభ్యర్థుల్ని బరిలో దింపగా.. ఒకరు ఎన్నికల మధ్యలోనే భాజపాలో చేరారని స్థానిక నేతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని