Nirmala Sitharaman: తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు: నిర్మలా సీతారామన్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేర్లను మార్చుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేంద్రం ఒకపేరు పెడితే.. రాష్ట్రం ఇంకో

Updated : 01 Sep 2022 20:50 IST

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేర్లను మార్చుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేంద్రం ఒకపేరు పెడితే.. రాష్ట్రం ఇంకో పేరు పెడుతోందని విమర్శించారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.20లక్షల కోట్లకు పెంచారు. ప్రాజెక్టుల వ్యయం ఇష్టమొచ్చినట్టుగా పెంచుతున్నారు. ‘మన ఊరు-మన బడి’ కేంద్ర పథకం అయితే దాన్ని రాష్ట్ర స్కీమ్‌గా క్లెయిమ్‌ చేసుకుంటున్నారు. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయనే ఆయుష్మాన్‌ భారత్‌లో చేరడం లేదు. తెలంగాణలో ప్రతి 100 మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారు. ఫసల్‌ బీమాయోజన ఎందుకు ఇవ్వడం లేదు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. రూ.లక్ష రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు. రైతు బీమా కౌలు రైతులకు ఎందుకివ్వరు? పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు తప్ప వాటిని నెరవేర్చడం లేదు. మిగులు బడ్జెట్‌ కాస్తా లోటు బడ్జెట్‌ అయ్యింది. బడ్జెట్‌ అప్రూవల్‌ కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడంలేదు. బడ్జెట్‌లో చాలా అప్పులు చూపించడం లేదు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది. తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని తెలంగాణ దాటిపోయింది. దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి మీరు సమాధానం చెప్పండి. లిక్కర్‌ స్కామ్‌లో ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలి’’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని