Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
బిహార్లో సీఎం నీతీశ్ కుమార్ రాజీనామాతో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ఆర్జేడీ-లెఫ్ట్ కూటమితో జట్టుకట్టారు......
పట్నా: ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజీనామాతో బిహార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ ఆర్జేడీ-లెఫ్ట్-కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్తో జట్టుకట్టారు. దీంతో బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం సాయంత్రం 4గంటలకు బిహార్ సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. భాజపాతో తెగదెంపులు చేసుకున్నామని.. ఆర్జేడీ సారథ్యంలో ఏడు పార్టీలతో కూడిన మహాఘట్బంధన్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఇప్పటికే నీతీశ్ గవర్నర్ను కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఒక్కరోజే నీతీశ్ వరుసగా రెండుసార్లు గవర్నర్ ఫాగు చౌహాన్తో భేటీ అయ్యారు. తొలిసారి భేటీలో భాజపాతో తెగదెంపులు చేసుకున్న విషయాన్ని గవర్నర్కు చెప్పి రాజీనామా లేఖను అందజేసిన నీతీశ్.. రెండోసారి భేటీలో ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్బంధన్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు.
మాకు 7 పార్టీల మద్దతు ఉంది: నీతీశ్
తమకు ఏడు పార్టీల మద్దతు ఉందని నీతీశ్ కుమార్ వెల్లడించారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు మొత్తంగా 164మంది సభ్యుల మద్దతు ఉందని చెప్పారు. వారంతా తమకు మద్దతుగా లేఖపై సంతకాలు చేసినట్టు తెలిపారు. ఈ బలంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీల కోరిక మేరకే తెగదెంపులు చేసుకున్నామని.. పార్టీ సభ్యులందరి ఏకాభిప్రాయంతోనేనే తాను సీఎం పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయాలని పార్టీ నేతలే కోరారని చెప్పారు.
నీతీశ్ ముందే మేల్కొన్నారు: తేజస్వీ యాదవ్
హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో భాజపాకు భాగస్వామ్య పార్టీలేవీ లేవని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. భాజపా ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీలను నాశనం చేస్తుందనే విషయాన్ని చరిత్రే చెబుతోందన్నారు. పంజాబ్, మహారాష్ట్రలలో జరిగిందేమిటో మనం చూశామని చెప్పారు. భాగస్వామ్య పార్టీలను చీల్చి భాజపా పగ్గాలు చేపట్టాలనుకుందని ఆక్షేపించారు. బిహార్లోనూ జేడీయూని చీల్చి భాజపా సొంతంగా పాలించాలనుకుందన్నారు. సీఎం నీతీశ్కుమార్ త్వరగా మేల్కొని భాజపా కూటమి నుంచి బయటకు వచ్చారని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను అంతం చేస్తామని జేపీ నడ్డా చెబుతుంటారని.. ప్రజల్ని భయపెట్టడం, కొనుగోలు చేయడమే భాజపాకు తెలుసని విరుచుకుపడ్డారు. బిహార్లో భాజపా అజెండా అమలు కాకూడదనే తామంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. నీతీశ్ కుమార్ దేశంలోనే అత్యధిక అనుభవం కలిగిన సీఎం అన్నారు.
నీతీశ్కు జితిన్ రాంమాంఝీ మద్దతు
నీతీశ్ కుమార్ నాయకత్వంలో బిహార్ అభివృద్ధి చెందుతోందని మాజీ సీఎం, హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్ జితిన్ రామ్ మాంఝీ కొనియాడారు. బిహార్ అభివృద్ధికి రూపశిల్పిగా ఆయన్ను అభివర్ణించారు. ఆ విశ్వాసంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయనతో కలిసి పనిచేయాలని శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నారు.
ప్రజా తీర్పుతో ఆటలా?: భాజపా ఫైర్
ఇంకోవైపు ఎన్డీయే కూటమి నుంచి నీతీశ్ కుమార్ బంధం తెంచుకోవడం పట్ల కమలనాథులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నీతీశ్.. భాజపాను, బిహార్ ప్రజలను మోసం చేశారంటూ దుయ్యబడుతున్నారు. ‘‘2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కింద మేం పోటీ చేసి విజయం సాధించాం. మాకు సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. నీతీశ్ను సీఎంగా ఎన్నుకున్నాం. కానీ, ఈ రోజు ఆయన భాజపాను, బిహార్ ప్రజలకు ద్రోహం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటీకీ సహించబోరు. ప్రజాతీర్పుతో నీతీశ్ ఆటలాడుతున్నారు’’ అని బిహార్ భాజపా చీఫ్ సంజయ్ జైశ్వాల్ ధ్వజమెత్తారు.
నీతీశ్ అవకాశవాది: కేంద్రమంత్రి చౌబే
నీతీశ్ కుమార్ అవకాశవాది అని భాజపా నేత, కేంద్రమంత్రి అశ్వనీ చౌబే అన్నారు. బిహార్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బిహార్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు దిల్లీలో బయల్దేరిన ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘భాజపా ఎవరినీ అణచివేయదు.. ఎవరికీ ద్రోహం చేయదు. వాళ్లే అభివృద్ధికి అడ్డుపుల్లలు వేస్తూ మోసం చేస్తున్నారు. వాజ్పేయీ ప్రభుత్వం నుంచి మోదీ సర్కార్ వరకు బిహార్ అభివృద్ధే మాకు తొలి ప్రాధాన్యం. గత ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలిచినా మేం నీతీశ్ను సీఎంని చేశాం. ఆయన రెండు సార్లు ప్రజల్ని మోసగించారు. అహంకారంతో కొట్టుకొంటున్నారు’’ అని మండిపడ్డారు.
భాజపాతో ప్రమాదాన్ని నీతీశ్ గ్రహించారు: సీపీఐఎంఎల్(లిబరేషన్)
భాజపాతో కలిసి ఉండటం ప్రమాదకరమని నీతీశ్ కుమార్ గ్రహించారని సీపీఐఎంఎల్ (లిబరేషన్ ) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అన్నారు. భాజపాకు ఎప్పట్నుంచో మిత్రపక్షంగా ఉన్న జేడీయూ కూడా కాషాయ దళం ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తోందని అంగీకరించిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AAP: పదేళ్లలో దిల్లీకి ఏం చేశారు?.. భాజపా ఎంపీలకు ఆప్ ప్రశ్న!
గత పదేళ్లలో భాజపా ఎంపీలు దిల్లీ నగరానికి ఏం చేశారో చెప్పాలని ఆప్ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. -
BRS: ప్రవీణ్కుమార్ను భారాస ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాం: కేసీఆర్
తమ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో అవకాశం కల్పిస్తామని భారాస అధినేత కేసీఆర్ తెలిపారు. -
PM CARES Fund: పీఎం కేర్స్ నిధులపై పారదర్శకత ఎక్కడ?: కాంగ్రెస్
‘పీఎం కేర్స్’ను ఎందుకు ఏర్పాటుచేశారో ఇప్పటికీ స్పష్టత లేదని, వాటికి నిధులు ఇచ్చినవారు ఎవరు? ఆ వివరాలపై ఎందుకు పారదర్శకత లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. -
Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు
కోడికత్తి డ్రామా నుంచి వివేకా హత్య వరకూ అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్.. ఇప్పుడు కుల, మత రాజకీయాలపై పడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. -
BJP: జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి ఏ లబ్ధికి కాంగ్రెస్లోకి వెళ్లారు?: రఘునందన్రావు
భాజపా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, భారాస ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయని భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. -
NDA: బిహార్లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి.. అధిక స్థానాల్లో భాజపా పోటీ
బిహార్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. భాజపా అత్యధికంగా 17 స్థానాల్లో పోటీ చేయనుంది. -
RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ భారాసలో చేరారు. -
TDP: ‘ప్రజాగళం’ పేరుతో మరిన్ని సభలు.. తెదేపా నిర్ణయం
తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. -
Prathipati Pulla rao: సభ విఫలం చేయాలని కుట్రలు చేశారు: ప్రత్తిపాటి
బొప్పూడిలో జరిగిన ‘ప్రజాగళం’ ఎన్డీయే కూటమి సభ అంచనాలకు మించి విజయవంతమైందని మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. -
PM Modi: వారి సవాల్ను స్వీకరిస్తున్నా.. రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోదీ ఫైర్
PM Modi: ‘శక్తి’ని నిర్వీర్యం చేస్తామంటూ విపక్ష కూటమి తమ మేనిఫెస్టోలో చెబుతోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. శక్తిని ఆరాధించేవారికి, నాశనం చేయాలనుకునేవారి మధ్యే ఈ పోరాటం అని అన్నారు. -
Nadendla Manohar: బొప్పూడి సభలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది: నాదెండ్ల మనోహర్
బొప్పూడిలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. -
BRS: దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కలిసిన భారాస నేతలు
కాంగ్రెస్లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ను కలిసింది. -
Atchannaidu: ప్రభుత్వ వెబ్సైట్లలో జగన్ చిత్రాలు తొలగించాలి: అచ్చెన్నాయుడు
ప్రభుత్వ శాఖల వైబ్సైట్లలో సీఎం జగన్, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. -
AP Congress: ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. -
PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. -
Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. -
Nara Lokesh: అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు: నారా లోకేశ్
వైకాపా హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. -
ప్రధాని పర్యటనలో పోలీసుల తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్న కూటమి నేతలు
ప్రజాగళం సభకు పోలీసులు అడుగడుగునా అనేక అవరోధాలు సృష్టించడం, ప్రధాని మోదీ పాల్గొంటున్న సభ అయినా బేఖాతరుగా వ్యవహరించడం, సహాయనిరాకరణ వంటివన్నీ సభను విఫలం చేసేందుకు పన్నిన కుట్రలో భాగమని తెదేపా, జనసేన, భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
Gudivada Amarnath: గాజువాకలో అమర్నాథ్కు ఝలక్
విశాఖ జిల్లా గాజువాక వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మంత్రి అమర్నాథ్కు పార్టీశ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఆయన గాజువాకలో తొలిసారిగా పార్టీశ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. -
జగన్ సీఎం కాదు.. సారా వ్యాపారి
తిరుపతి బాలాజీ ఆశీస్సులతో 2014లో ఎన్డీయే విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ ఆశీస్సులతో మళ్లీ మొదలుపెడుతున్నాం. అంతకుమించిన ఘన విజయాన్ని సాధిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. -
జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటే
‘వికసిత భారత్ కోసం ఇదే సమయం. సరైన సమయం’ అనేది నరేంద్రమోదీ నినాదం. దేశానికి సరైన సమయంలో మోదీ లాంటి సరైన నాయకుడు దొరికారు. ఆ దిశగా మీ ప్రతి ప్రయత్నంలో మేము మీతో ఉంటామని మాటిస్తున్నాం.
తాజా వార్తలు (Latest News)
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
IPL: బెరెన్డార్ఫ్ ఔట్.. ఇంగ్లాండ్ పేసర్కు ముంబయి ఇండియన్స్ పిలుపు
-
Online Voting: వారికి ఆన్లైన్ ఓటింగ్ కల్పించాలి: మాజీ సీఈసీ కృష్ణమూర్తి
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
-
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
-
Medicine Racket: నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ ముమ్మర దాడులు