AAP: గోవా ఎన్నికలు.. టీఎంసీతో పొత్తుపై ఆప్‌ కీలక ప్రకటన

గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో పొత్తు ఉండదని ఆదివారం ప్రకటించింది. సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. మంచి...

Published : 13 Dec 2021 01:07 IST

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో పొత్తు ఉండదని ఆదివారం ప్రకటించింది. సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. మంచి అభ్యర్థులను అందించాలని, నిజాయతీ, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆప్‌ కృతనిశ్చయంతో ఉందని పార్టీ గోవా ఇన్‌ఛార్జి అతిషి వెల్లడించారు. ‘టీఎంసీతో పొత్తు ఉండదు. కాబట్టి.. వారితో చర్చలు జరిపే ప్రశ్నే లేదు. మంచి అభ్యర్థులతో గోవాకు సరికొత్త ప్రత్యామ్నాయాన్ని అందించాలని, నిజాయతీ, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాం' అని ఆమె ఆదివారం ట్వీట్ చేశారు.

‘ఆమ్‌ ఆద్మీ పార్టీ గోవాలో టీఎంసీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. ఈ విషయమై ఇరు పార్టీల మధ్య ఒక రౌండ్‌ చర్చలూ జరిగాయి. కానీ.. ఈ ప్రతిపాదనపై టీఎంసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అంటూ వచ్చిన ఓ వార్తాకథనాన్ని ఉటంకిస్తూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ రచయిత చేసిన ట్వీట్‌పై అతిషీ ఈ విధంగా స్పందించారు. ఇదిలా ఉండగా, అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్‌ 2017లోనూ ఇక్కడ పోటీ చేయగా.. ఒక్క సీటు కూడా గెలవలేదు. మరోవైపు గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల ప్రకటించిన టీఎంసీ.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు