మేం లేకుండా 2023లో ఎవరూ ఏంచేయలేరు: కుమారస్వామి
కర్ణాటకలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తమ పార్టీ లేకుండా రాష్ట్రంలో......
బెంగళూరు: కర్ణాటకలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తమ పార్టీ లేకుండా రాష్ట్రంలో ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులు అన్ని పార్టీల్లోనూ సర్వసాధారణ విషయమైపోయిందన్నారు. జేడీఎస్ బలోపేతమవుతోందనీ.. అంతేకాకుండా 2023 ఎన్నికల తర్వాత తమ పార్టీ లేకుండా ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తమ పార్టీని కాపాడుతూ, దాన్ని పెంచి పోషించే ఓ వర్గం ఉందనీ.. వారెప్పటికీ పార్టీని వీడిపోయేవారు కాదనే అహంతో తానిలా మాట్లాడటంలేదన్నారు. తమ పార్టీ కార్యకర్తల వల్లే జేడీఎస్ ఇలా ఉంది తప్ప నేతల వల్ల కాదన్నారు. ఎలాంటి నేతలూ లేకుండానే పలు ఎన్నికల్లో సీట్లు గెలుచుకున్నామన్నారు. గతంలో సిద్ధరామయ్య జేడీఎస్లో ఉన్నప్పుడు 19శాతం ఓట్లు సాధించామనీ.. ఆయన బయటకు వెళ్లాక కూడా అలాగే ఉందన్నారు. ఇది కార్యకర్తల వల్లే తప్ప తనవల్ల అని చెప్పుకోవడంలేదన్నారు. మరోవైపు, కుమారస్వామి ఇప్పటికే ‘మిషన్ 123’ ప్రకటించారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు గాను కనీసం 123 సీట్లు గెలుచుకొని స్వతంత్రంగా అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఇటీవల వ్యాఖ్యానించని విషయం తెలిసిందే.
2018లో కర్ణాటకలో ఏ ఒక్కపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు కుమారస్వామి సీఎంగా ఉన్నారు. అయితే, 2019లో సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి భాజపాలో చేరడంతో కుమారస్వామి సారథ్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. దీంతో అప్పట్లో భాజపా సీనియర్ నేత యడియూరప్ప నేతృత్వంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. -
ప్రజాగళం విజయవంతంతోసర్దుకుంటున్న జగన్ సర్కారు
చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
వైకాపాలో చేరిన తెదేపా నేత రామచంద్రరావు
విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. -
ఆయన మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశారు
ఇటీవల భాజపాలో చేరిన సీనియర్ నేత అశోక్ చవాన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. -
ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఏకాభిప్రాయ దిశగా సాగుతోంది. నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించించగా మిగిలిన 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. -
ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు
‘‘ప్రజాజీవితంలో ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలి. మన ప్రజలు.. మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అటు ఓటేశారని... ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు