Prashant Kishor: రాజకీయ పార్టీ పెట్టట్లేదు.. అక్టోబరు 2 నుంచి పాదయాత్ర: ప్రశాంత్ కిశోర్
దిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల చేసిన ఓ ట్వీట్తో ఆయన రాజకీయ ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పీకే సొంతంగా రాజకీయ పార్టీని పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా దీనిపై ఆయన స్పష్టతనిచ్చారు. ప్రస్తుతానికి కొత్త పార్టీ ఏమీ పెట్టలేదని వెల్లడించిన పీకే.. బిహార్ పురోగతి కోసం 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
‘‘ప్రజలను నేరుగా కలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకు మార్గం ‘జన సురాజ్’. ఈ కొత్త ప్రయాణం బిహార్ నుంచే’’ అంటూ ప్రశాంత్ కిశోర్ ఇటీవల ట్విటర్లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి తన భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన 17వేల నుంచి 18వేల మంది ప్రముఖులను కలిసి మాట్లాడనున్నట్లు పీకే వివరించారు. వారి నుంచి సమస్యలు, అభిప్రాయలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. ‘‘ఒకవేళ తమ సమస్యల పరిష్కారం కోసం ఓ రాజకీయ వేదిక కావాలని బిహార్ ప్రజలు కోరకొంటే.. తప్పుకుండా నేను దాని గురించి ఆలోచిస్తాను. అయితే, రాష్ట్రంలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేనందున ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీని పెట్టే ఆలోచన లేదు’’ అని పీకే వెల్లడించారు.
3వేల కి.మీల పాదయాత్ర..
అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల కి.మీల పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ‘‘రాష్ట్ర పురోభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. బిహార్ ఇప్పటికీ ఇతర రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉంది. లాలూ, నీతీశ్ పాలనలో రాష్ట్రం ఏ మాత్రం పురోగతి సాధించలేదు. అందుకే వచ్చే మూడు, నాలుగేళ్లు ప్రజలను కలుస్తా. ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటా. వారి నుంచి అభిప్రాయాలు కోరతా’’ అని పీకే తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022: రసవత్తర ఫైనల్ పోరు.. వెండితో సరిపెట్టుకున్న భారత్
-
General News
Parrot: ‘ఆ చిలుక నన్ను తెగ ఇబ్బంది పెడుతోంది’.. పోలీసులకు వృద్ధుడి ఫిర్యాదు
-
Sports News
World Chess: ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
-
India News
Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
-
World News
Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్ కాన్సులేట్ జనరల్
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
- Rishi Sunak: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ ఫిర్యాదు ఏంటో తెలుసా..?
- INDw vs AUSw : కామన్వెల్త్ ఫైనల్.. ఆసీస్ను కట్టడి చేసిన భారత బౌలర్లు