Nitish Kumar: నవీన జాతిపిత దేశానికి ఏం చేశారు..? : నీతీష్ కుమార్
ప్రధాని అభ్యర్థిత్వంపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మరోసారి స్పష్టతనిచ్చారు. తనకు ఆ పదవిపై ఆశలేదని పేర్కొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: ప్రధాని మోదీని నవీన భారత జాతిపితగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్ డిసెంబర్లో చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ ఘాటుగా స్పందించారు. నవీన భారత జాతి పిత దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘వారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు. ఆర్ఎస్ఎస్ కూడా స్వాతంత్య్ర పోరాటానికి ఏమీ చేయలేదు. నవీన భారత్కు సరికొత్త జాతి పిత ఏం చేశారు..?’’ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేరును ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే తనకు ఎటువంటి సమస్య లేదని నీతీశ్ కుమార్(Nitish Kumar) పేర్కొన్నారు. తాను ప్రధాని పదవిని కోరుకోవడంలేదని పునరుద్ఘాటించారు. ఇటీవల కాంగ్రెస్ నేత కమల్నాథ్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో రాహుల్(Rahul Gandhi) ప్రధాని అభ్యర్థి కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని రోజుల్లోనే నీతీశ్ స్పందించడం గమనార్హం. ‘‘అన్ని మిత్ర పక్షాలతో మాట్లాడి వారు ఈ అంశాన్ని ప్రకటించాలి. ప్రస్తుతం వారు భారత్జోడో యాత్రలో బిజీగా ఉన్నట్లున్నారు. భవిష్యత్తు పరిణామాలపై మేం దృష్టిపెట్టాం’’ అని ఓ జాతీయ మీడియాతో నీతీశ్ వ్యాఖ్యానించారు.
శనివారం బిహార్లో విద్యాశాఖలో వందల మంది ఉద్యోగులకు నియామక పత్రాలు ఇస్తున్న సమయంలో నీతీశ్(Nitish Kumar) విలేకర్లతో మాట్లాడారు. భారీ ఎత్తున ఉద్యోగాలిస్తామని వారి కూటమి చేసిన హామీలో భాగంగా ఈ అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు.
ఆగస్టు నెలలో కాషాయ పార్టీకి జేడీయూ గట్టి షాక్ ఇచ్చింది. భాజపా నుంచి తన రాజకీయ మనుగడకు ముప్పు పొంచి ఉందన్న భావనతో జేడీయూ అధినేత, సీఎం నీతీశ్ కుమార్ ఆ పార్టీతో సుదీర్ఘ బంధానికి గుడ్బై చెప్పారు. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగి ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్