ఈసీ కొత్త రూల్స్‌: రాత్రి 7 దాటితే ర్యాలీలు వద్దు! 

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. బెంగాల్‌లో తదుపరి మూడు దశల ఎన్నికల ప్రచారానికి కొత్త రూల్స్‌ పెట్టింది. రాత్రి 7గంటల నుంచి ఉదయం 10గంటల వరకు రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది.

Updated : 17 Apr 2021 10:15 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. బెంగాల్‌లో తదుపరి మూడు దశల ఎన్నికల ప్రచారానికి కొత్త రూల్స్‌ పెట్టింది. రాత్రి 7గంటల నుంచి ఉదయం 10గంటల వరకు రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. దీంతో పాటు సైలెన్స్‌ పీరియడ్‌ను 48గంటల నుంచి 72గంటలకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.

ప్రచారంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులే మాస్క్‌లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. కొవిడ్ రెండో విజృంభణ నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భౌతికదూరం, మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.  ప్రచారం సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించేలా జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది. పశ్చిమ్‌బెంగాల్‌లో ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి కాగా.. శనివారం రోజున ఐదో విడత ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని