మాకు ఓటేయకుంటే విద్యుత్తు, మంచినీరు కట్!
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఆ రాష్ట్ర వ్యవశాయశాఖ మంత్రి తపన్ దాస్గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తపన్ దాస్గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి ఓటెయ్యకపోతే విద్యుత్తు, మంచినీటి సరఫరాకు నోచుకోరని ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారు. సప్తగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దాస్గుప్తా శనివారం హుగ్లీలో ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తనకు ఓటేయని ఆయా ప్రాంతాల వారికి విద్యుత్తు, మంచినీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. వాటికోసం మీరు భాజపానే అడగాలని సూచించారు.
టీఎంసీకి చెందిన ఓ ఎమ్మెల్యే సైతం గతంలో ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే హమీదుల్ రెహ్మాన్ దినాజ్పుర్లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ తనకు ఓటేయని వారిని దేశద్రోహులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను ఆస్వాదించి.. పార్టీకి ఓటేయకుండా ద్రోహం చేస్తే వారిని దేశద్రోహులుగా పరిగణిస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీకే ఓటేయాలని ఓటర్లకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి