Maharashtra: బాలాసాహెబ్, శివసేన పేర్లు ఇతరులు వాడొద్దు.. ఈసీని ఆశ్రయించిన ఉద్ధవ్ వర్గం..!
ముంబయి: అసమ్మతి నేతలు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఉపయోగించకుండా ఆపాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గం శనివారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ముంబయిలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దానికి ఆమోదం లభించింది. బాలాసాహెబ్, శివసేన పేర్లను ఏ వర్గం ఉపయోగించకుండా చూడాలంటూ ఉద్ధవ్ వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.
‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న కొందరు ఎమ్మెల్యేలు.. బాలాసాహెబ్, శివసేన పేర్లను దుర్వినియోగం చేసి, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మేం అనుమానిస్తున్నాం. శిందే, ఆయన వర్గం కోరుకున్నట్లుగా వారు రాజకీయ పార్టీ పెట్టుకోవడాన్ని మేం నిషేధించలేం. అయితే ఈ రెండు పేర్లను ఉపయోగించడాన్ని మాత్రం మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని ముందస్తుగా మీ దృష్టికి తీసుకువస్తున్నాం’ అని ఈసీకి రాసిన లేఖలో పేర్కొంది. శిందే వర్గం కొత్త పార్టీ స్థాపించనుందని, దానికి ‘శివసేన బాలాసాహెబ్ ఠాక్రే’ అని పేరు పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గం ఈసీని ఆశ్రయించింది. అలాగే ఈ రెండు పేర్లను ఉపయోగించిన వారిపై చట్టపరంగా ముందుగు వెళ్తామని పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ హెచ్చరించారు. తాము ఉద్ధవ్ నాయకత్వంలోనే ముందుకు వెళ్తామని చెప్పారు.
16 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు..
పార్టీ విప్ సునీల్ ప్రభు ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరైనందుకు 16 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు అందాయి. వారంతా సోమవారం సాయంత్రం ఐదులోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలు.. వరుస సెలవులతో అనూహ్య రద్దీ
-
Ap-top-news News
Hindupuram: హిందూపురంలో ‘ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం’ రెడీ..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
-
World News
Taliban: కాబుల్లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Ross Taylor : ఆ మ్యాచ్లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- Taliban: కాబుల్లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
- kareena kapoor: వాళ్లే మా సినిమాను ట్రోల్ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?