Gujarat: గుజరాత్లో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరుకానున్నారు.
ఇంటర్నెట్డెస్క్: గుజరాత్(Gujarat)లో భాజపా(BJP) ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఇప్పటి వరకు 111 స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించింది. అధికారం చేపట్టడానికి అవసరమైన 92 స్థానాల మార్కును భాజపా(BJP) దాటేసింది. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (Bhupendra Patel)రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ(Modi), హోంశాఖ మంత్రి అమిత్షా హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు 50కిపైగా సీట్లను కోల్పోగా.. ఆ మేరకు భాజపా లబ్ధిపొందింది.
ఈ విజయంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా అద్భుత ప్రచారానికి లభించిన ప్రత్యక్ష నిదర్శనం. ఇది అద్భుత విజయం. కొందరు మార్పు(పరివర్తన్)గురించి మాట్లాడారు. కొంత మంది గుజరాత్లో తామే గెలుస్తామని చెప్పారు. ఈ రోజు వారి సవాళ్లకు జవాబు లభించింది’’ అని అన్నారు. పాటీదార్ సామాజిక వర్గానికి చెందిన నేత హార్దిక్ పటేల్ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఇది భాజపా పనితీరుకు, ఆర్టికల్ 370 తొలగింపునకు లభించిన విజయం. రానున్న 20 ఏళ్లలో మేం చేయాల్సిన పనిపై దృష్టిపెడతాము. ఆమ్ ఆద్మీ పార్టీతో అసలు పోటీనే లేదు’’ అని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BRS: నాందేడ్లో భారాస బహిరంగ సభకు సర్వం సిద్ధం
-
Movies News
social look: అనుపమ మెరుపులు.. ప్రియా ప్రకాశ్ హొయలు.. హెబ్బా అందాలు..
-
Politics News
CM KCR: కేసీఆర్తో పలు రాష్ట్రాల నేతలు భేటీ.. భారాసలో చేరేందుకు సుముఖత
-
India News
Tamil Nadu: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళల మృతి
-
Sports News
IND vs AUS: ఆసీస్ జట్టు బుర్రలో ఇప్పటికే అశ్విన్ తిష్ట వేశాడు: జాఫర్
-
Politics News
Chandrababu: సీఎం నిర్లక్ష్యం వల్లే అంకుర వ్యవస్థ ధ్వంసం: చంద్రబాబు