భాజపా హయాంలో అన్ని వర్గాలకు భద్రత: షా
అసోంలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కోక్రఝర్లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో వెల్లడించారు.
గువహటి: అసోంలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కోక్రఝర్లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో వెల్లడించారు. ‘కేవలం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే అసోంను అవినీతి, ఉగ్రవాద, కాలుష్య రహితంగా మార్చగలదు. అసోంలో రాబోయే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక పోరాటాలకు ముగింపు పలుకుతూ గతేడాది బోడోలాండ్ ప్రాదేశిక ఒప్పందం జరిగింది. గతంలోని ప్రభుత్వాలు కూడా బోడో పోరాట సంఘాలతో ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కానీ వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యాయి’ అని షా విమర్శించారు.
‘బీటీఆర్ ఒప్పందంలోని అన్ని క్లాజులను నెరవేర్చి.. తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, భాజపాలు కట్టుబడి ఉన్నాయి. భాజపా ప్రభుత్వ హయాంలోనే అసోంలోని అన్ని వర్గాల రాజకీయ హక్కులు, సంస్కృతి, భాష భద్రంగా ఉంటాయి. అన్ని వర్గాల సంస్కృతి, భాష, వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది’ అని షా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమిత్షా బోడో ప్రాంతంలో రహదారి నెట్వర్క్ను నిర్మించేందుకు రూ.500 కోట్లు ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా శనివారం అసోంలో పర్యటించారు. దాదాపు లక్ష మందికి పైగా ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కాగా బోడోలాండ్ డిమాండ్తో దశాబ్దాలుగా హింసాత్మక మార్గంలో పోరాటాలు చేస్తున్న బోడోలాండ్ ప్రజాస్వామ్య కూటమి సహా పలు సంఘాలతో అసోం ప్రభుత్వం గతేడాది కీలక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్